Political News

ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. రాజీ మంత్రం..

ఏపీ రాజ‌కీయాల్లోకి వైఎస్ కుమార్తె ష‌ర్మిల ప్ర‌వేశిస్తార‌ని.. ఆమె కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికికాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు కూడా తోడ‌వుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్ర రాజు, మ‌రోసీనియ‌ర్ నేత తుల‌సి రెడ్డి వంటి వారు ష‌ర్మిల రాక ఖాయ‌మ‌ని చెప్పుకొచ్చారు. ఆమె రాగానే తాము ఆమె బాట‌లో న‌డుస్తామ‌ని.. ప్ర‌క‌టించారు. దీనికి తోడు వైసీపీకి బ‌ల‌మైన విశ్వ‌స‌నీయ నాయ‌కుడు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృ ష్ణారెడ్డి సైతం ఇదే ప్ర‌క‌ట‌న చేశారు.

మొత్తంగా చూస్తే.. ష‌ర్మిల‌కు ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం.. గ్యాసిప్ కాద‌ని.. వాస్త‌వ‌మేన‌న్న‌ది వీరి వ్యాఖ్య‌లు జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. ష‌ర్మిల టార్గెట్ వైసీపీనే. అందునా.. త‌న‌ను మాన‌సికంగా.. ఆస్తుల ప‌రంగా ఇబ్బంది పెట్టార‌నిభావిస్తున్న సొంత అన్న‌, సీఎం జ‌గ‌నే ఆమె టార్గెట్ గా మార‌నుందనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉన్న చ‌ర్చ‌. అంతేకాదు.. ష‌ర్మిల క‌నుక ఏపీలోకి అడుగు పెడితే.. కీల‌క‌మైన వైసీపీ ఓటు బ్యాంకు కూడా క‌ద‌ల‌బారే ప్ర‌మాదం.. కూడా ఉంది.

దీనిని గ‌మ‌నించిన తాడేప‌ల్లి వ‌ర్గాలు.. రాజీ మంత్రం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని.. వ‌స్తే.. వైసీపీలోనే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతోపాటు.. క‌డ‌ప లేదా విశాఖ ఎంపీ సీటును ఇస్తామ‌ని.. ఆస్తుల‌ను కూడా పంచేందుకు రెడీ అని రాయ‌బారం పంపిన‌ట్టు తాడేప‌ల్లిలోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.  షర్మిల కాంగ్రెస్‌లో చేరితే..  వైసీపీకి నష్టం  జరుగుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నార‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలో  మనస్పర్థలు పక్కనపెట్టి అన్న, చెల్లెలను కలిపేలా యత్నాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. షర్మిల విషయంపై విజయమ్మతో ఇప్పటికే చర్చలు ప్రారంభించార‌ని స‌మాచారం. మధ్యవర్తిగా జగన్ పెద్దనాన్న కుమారుడు ప్ర‌ముఖ వైద్యులు డాక్ట‌ర్‌ అనిల్‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిసింది.  అనిల్‌రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న విజయమ్మ ఆయ‌న చెప్పింది వింటార‌ని అంటున్నారు. రాజీ కుదిర్చేందుకు విజయమ్మముందు పలు ప్రతిపాదనలు పెట్టార‌ని స‌మాచారం.

ఇవీ ఆఫ‌ర్లు..

+ షర్మిలకు సిమెంట్‌ కర్మాగారంతో పాటు ఎంపీ టికెట్‌(విశాఖ‌-విజ‌య‌వాడ‌-క‌డ‌ప ఏది కోరుకుంటే అది)

+ రాజీ కుదిరితే షర్మిలకు ఆస్తుల పంపకం.

+ పార్టీలోనూ కీల‌క బాధ్య‌త‌లు.

కండిష‌న్లు..

+ కాంగ్రెస్‌లో చేరొద్దు.

This post was last modified on January 1, 2024 11:08 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టి నేత‌లు ప‌రార్‌.!

ఏపీలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరిగాయి. ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగిన ఈ నెల 13న, ఆ రోజు త‌ర్వాత కూడా..…

11 mins ago

రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6…

2 hours ago

తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…

3 hours ago

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

4 hours ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

4 hours ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

5 hours ago