ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ కుమార్తె షర్మిల ప్రవేశిస్తారని.. ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికికాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు కూడా తోడవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్ర రాజు, మరోసీనియర్ నేత తులసి రెడ్డి వంటి వారు షర్మిల రాక ఖాయమని చెప్పుకొచ్చారు. ఆమె రాగానే తాము ఆమె బాటలో నడుస్తామని.. ప్రకటించారు. దీనికి తోడు వైసీపీకి బలమైన విశ్వసనీయ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృ ష్ణారెడ్డి సైతం ఇదే ప్రకటన చేశారు.
మొత్తంగా చూస్తే.. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం.. గ్యాసిప్ కాదని.. వాస్తవమేనన్నది వీరి వ్యాఖ్యలు జరుగుతున్న పరిణామాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఇదే జరిగితే.. షర్మిల టార్గెట్ వైసీపీనే. అందునా.. తనను మానసికంగా.. ఆస్తుల పరంగా ఇబ్బంది పెట్టారనిభావిస్తున్న సొంత అన్న, సీఎం జగనే ఆమె టార్గెట్ గా మారనుందనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్న చర్చ. అంతేకాదు.. షర్మిల కనుక ఏపీలోకి అడుగు పెడితే.. కీలకమైన వైసీపీ ఓటు బ్యాంకు కూడా కదలబారే ప్రమాదం.. కూడా ఉంది.
దీనిని గమనించిన తాడేపల్లి వర్గాలు.. రాజీ మంత్రం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టవద్దని.. వస్తే.. వైసీపీలోనే కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు.. కడప లేదా విశాఖ ఎంపీ సీటును ఇస్తామని.. ఆస్తులను కూడా పంచేందుకు రెడీ అని రాయబారం పంపినట్టు తాడేపల్లిలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్లో చేరితే.. వైసీపీకి నష్టం జరుగుతుందనే ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు.
ఈ క్రమంలో మనస్పర్థలు పక్కనపెట్టి అన్న, చెల్లెలను కలిపేలా యత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. షర్మిల విషయంపై విజయమ్మతో ఇప్పటికే చర్చలు ప్రారంభించారని సమాచారం. మధ్యవర్తిగా జగన్ పెద్దనాన్న కుమారుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిసింది. అనిల్రెడ్డితో సన్నిహితంగా ఉంటున్న విజయమ్మ ఆయన చెప్పింది వింటారని అంటున్నారు. రాజీ కుదిర్చేందుకు విజయమ్మముందు పలు ప్రతిపాదనలు పెట్టారని సమాచారం.
ఇవీ ఆఫర్లు..
+ షర్మిలకు సిమెంట్ కర్మాగారంతో పాటు ఎంపీ టికెట్(విశాఖ-విజయవాడ-కడప ఏది కోరుకుంటే అది)
+ రాజీ కుదిరితే షర్మిలకు ఆస్తుల పంపకం.
+ పార్టీలోనూ కీలక బాధ్యతలు.
కండిషన్లు..
+ కాంగ్రెస్లో చేరొద్దు.
This post was last modified on January 1, 2024 11:08 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…