తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని, పదేళ్లలో బీఆర్ఎస్ అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తామని.. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది…కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను కేటీఆర్ ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు.
దీంతో, కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అది ఫేక్ వీడియో అని 2 రోజుల క్రితమే తాను వివరణ కూడా ఇచ్చానని, ఫేక్ వీడియోకు ఒరిజినల్ వీడియోకు కూడా కేటీఆర్ కు తేడా తెలియదని సిద్ధరామయ్య చురకలంటించారు. అది తెలియదు కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయారని కేటీఆర్ పై సెటైర్లు వేశారు. బిజెపి సృష్టించే నకిలీ ఎడిటెడ్ వీడియోలను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తోందని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలే మీ బతుకు తెరువు అని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on December 19, 2023 9:56 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…