తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని, పదేళ్లలో బీఆర్ఎస్ అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తామని.. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది…కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను కేటీఆర్ ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు.
దీంతో, కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అది ఫేక్ వీడియో అని 2 రోజుల క్రితమే తాను వివరణ కూడా ఇచ్చానని, ఫేక్ వీడియోకు ఒరిజినల్ వీడియోకు కూడా కేటీఆర్ కు తేడా తెలియదని సిద్ధరామయ్య చురకలంటించారు. అది తెలియదు కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయారని కేటీఆర్ పై సెటైర్లు వేశారు. బిజెపి సృష్టించే నకిలీ ఎడిటెడ్ వీడియోలను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తోందని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలే మీ బతుకు తెరువు అని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on December 19, 2023 9:56 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…