Political News

కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు నుంచే అన్ని హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరింటిలో రెండు హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. దీంతో, ఆ విషయాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు కూడా కాకముందే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీకి కొంత సమయం ఇవ్వాలని, పదేళ్లలో బీఆర్ఎస్ అమలు చేయని హామీలు ఎన్నో ఉన్నాయని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇస్తామని.. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది…కానీ డబ్బులు లేవు అని అసెంబ్లీలో సిద్ధరామయ్య చెబుతున్నట్లుగా ఉన్న వీడియోను కేటీఆర్ ట్వీట్ చేసి విమర్శలు గుప్పించారు.

దీంతో, కేటీఆర్ కు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అది ఫేక్ వీడియో అని 2 రోజుల క్రితమే తాను వివరణ కూడా ఇచ్చానని, ఫేక్ వీడియోకు ఒరిజినల్ వీడియోకు కూడా కేటీఆర్ కు తేడా తెలియదని సిద్ధరామయ్య చురకలంటించారు. అది తెలియదు కాబట్టే ఎన్నికల్లో ఓడిపోయారని కేటీఆర్ పై సెటైర్లు వేశారు. బిజెపి సృష్టించే నకిలీ ఎడిటెడ్ వీడియోలను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తోందని ఆరోపించారు. ఫేక్ ప్రచారాలే మీ బతుకు తెరువు అని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

This post was last modified on December 19, 2023 9:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

15 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

35 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

3 hours ago