కీలకమైన ఎన్నికల వేళ.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే వాదన వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు బంధు పథకం నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దని.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించింది. దీంతో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీకి భారీ దెబ్బతగిలినట్టు అయింది.
వాస్తవానికి.. కొన్నాళ్ల కిందటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఎన్నికలు 30వ తారీకున జరుగుతున్న నేపథ్యంలో.. ఈ నెల 28 సాయంత్రంలోపు ఈ పథకం కింద నిధులు విడుదల చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
దీంతో బీఆర్ ఎస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28(మంగళవారం) రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు.. సర్వం సిద్ధమైంది. అయితే.. ఇంతలోనే ఈ విషయం రాజకీయంగా మరోసారి వివాదంగా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై విపక్ష కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలపై స్టే విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది.
This post was last modified on November 27, 2023 1:27 pm
బడ్జెట్ తో సంబంధం లేకుండా తన సినిమా ఏదైనా రాజమౌళి అనుసరించే పద్దతి ఒకటుంది. కథను దాచుకోరు. వీలైనంత ముందే…
కేంద్రంలోని బీజేపీతోను.. ఇటు రాష్ట్రంలోని బీజేపీతోనూ కయ్యానికి సుముఖంగా లేమని వైసీపీ స్పష్టం చేస్తోంది. నిజానికి ఆది నుంచి కూడా…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈవీవీ సత్యనారాయణ గారు అలీబాబా అరడజను దొంగలు అనే సినిమా తీశారు. రాజేంద్ర ప్రసాద్…
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్…
``దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు మన వాళ్లు తుపాకీ తూటాలకే వెనుకాడలేదు. మీరు ఎంపీ అయి ఉండి.. కోడిగుడ్లకు భయపడతారా?``అంటూ.. తృణమూల్…