కీలకమైన ఎన్నికల వేళ.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే వాదన వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు బంధు పథకం నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దని.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించింది. దీంతో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీకి భారీ దెబ్బతగిలినట్టు అయింది.
వాస్తవానికి.. కొన్నాళ్ల కిందటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఎన్నికలు 30వ తారీకున జరుగుతున్న నేపథ్యంలో.. ఈ నెల 28 సాయంత్రంలోపు ఈ పథకం కింద నిధులు విడుదల చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
దీంతో బీఆర్ ఎస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28(మంగళవారం) రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు.. సర్వం సిద్ధమైంది. అయితే.. ఇంతలోనే ఈ విషయం రాజకీయంగా మరోసారి వివాదంగా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై విపక్ష కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలపై స్టే విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది.
This post was last modified on November 27, 2023 1:27 pm
జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన…
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…