కీలకమైన ఎన్నికల వేళ.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే వాదన వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు బంధు పథకం నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దని.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించింది. దీంతో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీకి భారీ దెబ్బతగిలినట్టు అయింది.
వాస్తవానికి.. కొన్నాళ్ల కిందటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఎన్నికలు 30వ తారీకున జరుగుతున్న నేపథ్యంలో.. ఈ నెల 28 సాయంత్రంలోపు ఈ పథకం కింద నిధులు విడుదల చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
దీంతో బీఆర్ ఎస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28(మంగళవారం) రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు.. సర్వం సిద్ధమైంది. అయితే.. ఇంతలోనే ఈ విషయం రాజకీయంగా మరోసారి వివాదంగా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై విపక్ష కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలపై స్టే విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది.
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…