కీలకమైన ఎన్నికల వేళ.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్కు భారీ ఎదురుదెబ్బ తగిలిందనే వాదన వినిపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు బంధు పథకం నిధులను ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయొద్దని.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపించింది. దీంతో మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీకి భారీ దెబ్బతగిలినట్టు అయింది.
వాస్తవానికి.. కొన్నాళ్ల కిందటే.. కేంద్ర ఎన్నికల సంఘానికి రైతు బంధు నిధుల విడుదల పై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేసింది. దీనిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకం కాబట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఎన్నికలు 30వ తారీకున జరుగుతున్న నేపథ్యంలో.. ఈ నెల 28 సాయంత్రంలోపు ఈ పథకం కింద నిధులు విడుదల చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
దీంతో బీఆర్ ఎస్ సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28(మంగళవారం) రైతు బంధు నిధులను విడుదల చేసేందుకు.. సర్వం సిద్ధమైంది. అయితే.. ఇంతలోనే ఈ విషయం రాజకీయంగా మరోసారి వివాదంగా మారింది. ఎన్నికల ప్రచార సభల్లో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంపై విపక్ష కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిధుల విడుదలపై స్టే విధించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయొచ్చని తెలిపింది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…