వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా పెట్టి ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నిప్రొడ్యూస్ చేశాడు.
కానీ ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. రివ్యూలు మరీ దారుణంగా వచ్చాయి. టాక్ కూడా ఏమంత బాగా లేదు. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ‘ఫంకీ’.. సోమవారం నుండి క్రాష్ అయిపోయింది. మినిమం ఆక్యుపెన్సీలు కరవైన పరిస్థితి.
ఈ మూవీ అత్యధికంగా డ్యామేజ్ చేసింది దర్శకుడు అనుదీప్కే. ‘జాతిరత్నాలు’ తర్వాత ‘ప్రిన్స్’తో అంచనాలను అందుకోలేకపోయిన అనుదీప్.. ‘ఫంకీ’తో పుంజుకుంటాడనుకున్నారు. కానీ ‘ప్రిన్స్’ మూవీనే నయం అనే టాక్ వచ్చింది.
అనుదీప్ ఒక జోన్లో ఉండిపోయాడని.. దాన్ని మించి సినిమాలు తీయలేడనే అభిప్రాయం బలపడిపోయింది. ఇక్కడి నుంచి కెరీర్ను ముందుకు తీసుకెళ్లడం సవాలే. ఇక ఆల్రెడీ హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న విశ్వక్ సేన్ కు కూడా ‘ఫంకీ’ రిజల్ట్ పెద్ద ఎదురుదెబ్బే. కొంత కాలంగా సక్సెస్ రేట్ బాగా పడిపోయి ఇబ్బందిపడుతున్న నాగవంశీకి కూడా ఇది షాకే. ‘అనగనగా ఒక రోజు’ విజయానందాన్ని ‘ఫంకీ’ ఆవిరి చేసింది.
ఐతే మిగతా అందరికీ మైనస్సే అయినా.. హీరోయిన్ కాయదు లోహర్కు మాత్రం ‘ఫంకీ’ ప్లస్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. సినిమా ఆడకపోయినా.. ‘ఫంకీ’తో జనాల దృష్టిలో పడింది. సినిమాకు ఆమె అందం, అభినయం ఆకర్షణగా నిలిచాయి. ప్రతి సన్నివేశంలోనూ హుషారుగా కనిపిస్తూ, నటిస్తూ ఆమె ఆకట్టుకుంది.
కుర్రాళ్లకు ఆమె తెగ నచ్చేసింది. చీర్ఫుల్గా ఉండే తన లుక్స్ కట్టిపడేశాయి. నటన కూడా బాగానే సాగడంతో కాయదుకు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. త్వరలోనే కాయదు కొత్త సినిమాల అనౌన్స్మెంట్లు రావచ్చని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
This post was last modified on February 17, 2026 11:44 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…