ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని నారాయణ షాకింగ్ ఆరోపణలు చేశారు. మొన్నటిదాకా బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కూతురి కోసం బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. బిజెపి, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం ఉందని, అందుకే కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయలేదని అన్నారు.
కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణకు గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఒకే దెబ్బకు మూడు పిట్టలు రాలతాయని, బిజెపి-బీఆర్ఎస్-ఎంఐఎంల ఓటమి తధ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన కేసుల కోసం మోడీ కాళ్ల ముందు తలవంచారని నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేంద్రం ముందు జగన్ మోకరిల్లడం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…