ఏపీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ పై సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారని నారాయణ షాకింగ్ ఆరోపణలు చేశారు. మొన్నటిదాకా బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ కూతురి కోసం బీజేపీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. బిజెపి, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం ఉందని, అందుకే కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేయలేదని అన్నారు.
కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణకు గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో ఒకే దెబ్బకు మూడు పిట్టలు రాలతాయని, బిజెపి-బీఆర్ఎస్-ఎంఐఎంల ఓటమి తధ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన కేసుల కోసం మోడీ కాళ్ల ముందు తలవంచారని నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేంద్రం ముందు జగన్ మోకరిల్లడం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సిపిఐ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
This post was last modified on November 24, 2023 3:09 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…