ఏపీలో వైసీపీ హయాంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కీలకమైన రహదారుల నిర్మాణ, బాగుజేత వంటివాటి విషయంలో వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం నుంచి సామాజిక సాధికార యాత్రల వరకు కూడా.. ఎక్కడ కనిపించినా.. ప్రజలు ఈ విషయంపైనే నిలదీస్తున్నారు.
ఇక, టీడీపీ-జనసేన మిత్రపక్షం ఆధ్వర్యంలో రహదారుల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలిపారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రజాప్రతినిధులకు నిరసన మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ మంత్రి కనిపించినా.. వైసీపీ ఎమ్మెల్యే కనిపించినా.. తమకు రహదారులు ఏవని, ఉన్నవాటిని బాగు చేయరెందకని ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు సర్దిచెబుతున్నా.. మరికొందరు మాత్రం సహనం కోల్పోతున్నారు.
ఈ క్రమంలో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలపై నే ఎదరు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. పింఛన్లు తీసుకోవడం మానేస్తారా? రోడ్లు వేయిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో గ్రామస్తులు నివ్వెర పోయారు.
This post was last modified on November 24, 2023 4:38 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…