Political News

‘రోడ్డు కావాలా.. అయితే.. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేయండి’

ఏపీలో వైసీపీ హ‌యాంలో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణ‌, బాగుజేత వంటివాటి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అస‌లు ప‌ట్టించుకోవ‌డం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం నుంచి సామాజిక సాధికార యాత్ర‌ల వ‌ర‌కు కూడా.. ఎక్క‌డ క‌నిపించినా.. ప్ర‌జ‌లు ఈ విష‌యంపైనే నిల‌దీస్తున్నారు.

ఇక‌, టీడీపీ-జన‌సేన మిత్ర‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో ర‌హ‌దారుల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా తెలిపారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నిర‌స‌న మ‌రింత ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఏ మంత్రి క‌నిపించినా.. వైసీపీ ఎమ్మెల్యే క‌నిపించినా.. త‌మ‌కు ర‌హ‌దారులు ఏవ‌ని, ఉన్న‌వాటిని బాగు చేయ‌రెందక‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంద‌రు స‌ర్దిచెబుతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం స‌హ‌నం కోల్పోతున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్ర‌జ‌ల‌పై నే ఎద‌రు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేస్తారా? రోడ్లు వేయిస్తాన‌ని వ్యాఖ్యానించారు. దీంతో గ్రామ‌స్తులు నివ్వెర పోయారు.

This post was last modified on November 24, 2023 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

20 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

39 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago