ఏపీలో వైసీపీ హయాంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కీలకమైన రహదారుల నిర్మాణ, బాగుజేత వంటివాటి విషయంలో వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం నుంచి సామాజిక సాధికార యాత్రల వరకు కూడా.. ఎక్కడ కనిపించినా.. ప్రజలు ఈ విషయంపైనే నిలదీస్తున్నారు.
ఇక, టీడీపీ-జనసేన మిత్రపక్షం ఆధ్వర్యంలో రహదారుల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా తెలిపారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ప్రజాప్రతినిధులకు నిరసన మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ మంత్రి కనిపించినా.. వైసీపీ ఎమ్మెల్యే కనిపించినా.. తమకు రహదారులు ఏవని, ఉన్నవాటిని బాగు చేయరెందకని ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు సర్దిచెబుతున్నా.. మరికొందరు మాత్రం సహనం కోల్పోతున్నారు.
ఈ క్రమంలో ప్రజలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్రజలపై నే ఎదరు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. పింఛన్లు తీసుకోవడం మానేస్తారా? రోడ్లు వేయిస్తానని వ్యాఖ్యానించారు. దీంతో గ్రామస్తులు నివ్వెర పోయారు.
This post was last modified on November 24, 2023 4:38 pm
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…