Political News

‘రోడ్డు కావాలా.. అయితే.. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేయండి’

ఏపీలో వైసీపీ హ‌యాంలో అభివృద్ధి మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణ‌, బాగుజేత వంటివాటి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం అస‌లు ప‌ట్టించుకోవ‌డం మానేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం నుంచి సామాజిక సాధికార యాత్ర‌ల వ‌ర‌కు కూడా.. ఎక్క‌డ క‌నిపించినా.. ప్ర‌జ‌లు ఈ విష‌యంపైనే నిల‌దీస్తున్నారు.

ఇక‌, టీడీపీ-జన‌సేన మిత్ర‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో ర‌హ‌దారుల దుస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా తెలిపారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నిర‌స‌న మ‌రింత ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఏ మంత్రి క‌నిపించినా.. వైసీపీ ఎమ్మెల్యే క‌నిపించినా.. త‌మ‌కు ర‌హ‌దారులు ఏవ‌ని, ఉన్న‌వాటిని బాగు చేయ‌రెందక‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంద‌రు స‌ర్దిచెబుతున్నా.. మ‌రికొంద‌రు మాత్రం స‌హ‌నం కోల్పోతున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ప్ర‌జ‌ల‌పై నే ఎద‌రు దాడి చేశారు. అధ్వానంగా మారిన తమ గ్రామ రహదారిని బాగు చేయాలని తనకల్లు మండలం చిన్నరామన్న గారిపల్లి వాసులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని గ్రామస్థులు విస్తుపోయారు. నియోజకవర్గంలో ప్రతినెల పింఛన్ల కోసం రూ.15 కోట్లు పంపిణీ చేస్తున్నామని వాటిని ఆపేస్తే రోడ్లన్నీ అద్దంలా చేయొచ్చన్నారు. పింఛ‌న్లు తీసుకోవ‌డం మానేస్తారా? రోడ్లు వేయిస్తాన‌ని వ్యాఖ్యానించారు. దీంతో గ్రామ‌స్తులు నివ్వెర పోయారు.

This post was last modified on November 24, 2023 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago