తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ధీటుగా ఇంకెవరు ఎదగకుండా అందరినీ తొక్కిపడేశారు. దానివల్ల ఇపుడేమైందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అందరు మోడీవైపు మాత్రమే చూస్తున్నారు.
సొంత బలం ఉన్న నేతల్లో చాలామందిని ఎందుకు పనికిరాని వారి కింద మోడీ మార్చేశారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో సమర్ధులున్నా వాళ్ళెవరు ఏ విషయంలోను జోక్యం చేసుకోవటంలేదు. ప్రతి విషయాన్ని మోడీ నిర్ణయానికే వదిలేస్తు కొందరు సీనియర్ మంత్రులు కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయటానికి మాత్రమే పరిమితమైపోయారు. మిగిలిన మంత్రుల్లో ఎలాగూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని యాక్ట్ చేసే అవకాశాలు లేవు.
హోలు మొత్తం మీద ఇపుడు పరిస్ధితి ఏమిటంటే ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలు తెలంగాణా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరంలో బీజేపీ గెలుపు అంత వీజీకాదని తేలిపోయింది. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో 50:50 ఛాన్సంటున్నారు. తెలంగాణాలో అసలు పోటీలోనే లేదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. మిజోరం సంగతి అందుబాటులో లేదు. సో ఏరకంగా చూసుకున్నా ఏ రాష్ట్రంలోను బీజేపీకి గెలుపు అవకాశాలు పెద్దగా కనబడటం లేదని అర్ధమవుతోంది.
పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీ సమర్ధతకు పెద్ద పరీక్షగా మారింది. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో బీజేపీలో నిరుత్సాహం పెరిగిపోతుంది. ప్రతి రాష్ట్రంలోను మోడీయే తిరిగి అభ్యర్ధులను, పార్టీని గెలిపించాలంటే జరిగే పనికాదు. మొన్ననే జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత కూడా మోడీ కళ్ళు తెరవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే బీజేపీకన్నా మోడీకే అసలైన పరీక్ష ఎదురవ్వబోతోందనేది.
This post was last modified on November 3, 2023 10:31 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…