తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ధీటుగా ఇంకెవరు ఎదగకుండా అందరినీ తొక్కిపడేశారు. దానివల్ల ఇపుడేమైందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అందరు మోడీవైపు మాత్రమే చూస్తున్నారు.
సొంత బలం ఉన్న నేతల్లో చాలామందిని ఎందుకు పనికిరాని వారి కింద మోడీ మార్చేశారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో సమర్ధులున్నా వాళ్ళెవరు ఏ విషయంలోను జోక్యం చేసుకోవటంలేదు. ప్రతి విషయాన్ని మోడీ నిర్ణయానికే వదిలేస్తు కొందరు సీనియర్ మంత్రులు కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయటానికి మాత్రమే పరిమితమైపోయారు. మిగిలిన మంత్రుల్లో ఎలాగూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని యాక్ట్ చేసే అవకాశాలు లేవు.
హోలు మొత్తం మీద ఇపుడు పరిస్ధితి ఏమిటంటే ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలు తెలంగాణా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరంలో బీజేపీ గెలుపు అంత వీజీకాదని తేలిపోయింది. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో 50:50 ఛాన్సంటున్నారు. తెలంగాణాలో అసలు పోటీలోనే లేదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. మిజోరం సంగతి అందుబాటులో లేదు. సో ఏరకంగా చూసుకున్నా ఏ రాష్ట్రంలోను బీజేపీకి గెలుపు అవకాశాలు పెద్దగా కనబడటం లేదని అర్ధమవుతోంది.
పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీ సమర్ధతకు పెద్ద పరీక్షగా మారింది. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో బీజేపీలో నిరుత్సాహం పెరిగిపోతుంది. ప్రతి రాష్ట్రంలోను మోడీయే తిరిగి అభ్యర్ధులను, పార్టీని గెలిపించాలంటే జరిగే పనికాదు. మొన్ననే జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత కూడా మోడీ కళ్ళు తెరవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే బీజేపీకన్నా మోడీకే అసలైన పరీక్ష ఎదురవ్వబోతోందనేది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…