తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ కాదు నరేంద్రమోడీకే అసలు పరీక్షగా మారబోతోంది. కారణం ఏమిటంటే పార్టీలో కానీ ప్రభుత్వస్ధాయిలో కానీ ఎవరినీ ఎదగనీయకుండా చేయటమే పెద్ద సమస్యగా మారింది. బీజేపీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని మోడీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. గడచిన తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంతో పాటు పార్టీలో తనకు ఎదురులేకుండా చేసుకున్నారు. తన నాయకత్వానికి ధీటుగా ఇంకెవరు ఎదగకుండా అందరినీ తొక్కిపడేశారు. దానివల్ల ఇపుడేమైందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అందరు మోడీవైపు మాత్రమే చూస్తున్నారు.
సొంత బలం ఉన్న నేతల్లో చాలామందిని ఎందుకు పనికిరాని వారి కింద మోడీ మార్చేశారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో సమర్ధులున్నా వాళ్ళెవరు ఏ విషయంలోను జోక్యం చేసుకోవటంలేదు. ప్రతి విషయాన్ని మోడీ నిర్ణయానికే వదిలేస్తు కొందరు సీనియర్ మంత్రులు కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయటానికి మాత్రమే పరిమితమైపోయారు. మిగిలిన మంత్రుల్లో ఎలాగూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని యాక్ట్ చేసే అవకాశాలు లేవు.
హోలు మొత్తం మీద ఇపుడు పరిస్ధితి ఏమిటంటే ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాలు తెలంగాణా, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరంలో బీజేపీ గెలుపు అంత వీజీకాదని తేలిపోయింది. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో 50:50 ఛాన్సంటున్నారు. తెలంగాణాలో అసలు పోటీలోనే లేదని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. మిజోరం సంగతి అందుబాటులో లేదు. సో ఏరకంగా చూసుకున్నా ఏ రాష్ట్రంలోను బీజేపీకి గెలుపు అవకాశాలు పెద్దగా కనబడటం లేదని అర్ధమవుతోంది.
పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీ సమర్ధతకు పెద్ద పరీక్షగా మారింది. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో బీజేపీలో నిరుత్సాహం పెరిగిపోతుంది. ప్రతి రాష్ట్రంలోను మోడీయే తిరిగి అభ్యర్ధులను, పార్టీని గెలిపించాలంటే జరిగే పనికాదు. మొన్ననే జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తర్వాత కూడా మోడీ కళ్ళు తెరవకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే బీజేపీకన్నా మోడీకే అసలైన పరీక్ష ఎదురవ్వబోతోందనేది.
This post was last modified on November 3, 2023 10:31 am
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…
ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…
ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…