Political News

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి మునిగిపోతుంది అంటూ వైసీపీ విష ప్రచారం చేస్తోంది. దీనిని టీడీపీ నేతలు సమర్థంగా తిప్పి కొడుతున్నారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలోనే ఉంటున్నారు. నదీ తీర ప్రాంతంలో ఉన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజ‌ధానిపై ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

న‌దీతీరం వెంబ‌డి సోకాల్డ్ రాజ‌ధానిని క‌డుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రివ‌ర్ బేసిన్‌లో చంద్రబాబు సోకాల్డ్ రాజ‌ధాని క‌డుతున్నారు. అయినా.. అంత భూమి ఎందుకు? ఇంత మంది రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర చర్చకు దారితీశాయి.

2019లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఓ ఇంటిని నిర్మించుకుని గృహ ప్రవేశం చేశారు. తాను అధికారంలో ఉన్న కాలంలో అక్కడ నుంచి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా నడిపించారు. 2024 లో ఓటమి పాలైన తర్వాత బెంగళూరులోని యలహంక నివాసంలో ఎక్కువ సమయం గడుపుతూ తాడేపల్లి అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు.

అయితే ఎప్పుడు కూడా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న దాఖలాలు లేవు. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గుర్తు చేశారు. ఆయన నదీ తీర ప్రాంతంలో నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఎప్పుడూ మునిగిపోలేదు కదా.. అని అన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న మహానగరాల గురించి ఓ వీడియో రూపొందించి బెంగళూరు ప్యాలెస్‌లో ఉండే జగన్‌కి పంపుతానని కూడా ఆయన తెలిపారు.  

మొత్తం మీద రివర్బేసిన్అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం ధీటుగానే సమాధానం ఇస్తోంది. అసలు రివర్బేసిన్కు, రివర్బెడ్కు తేడా కూడా జగన్ కు తెలియదంటూ మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రధాన మంత్రి మోదీ సహకారంతో అమరావతి నిర్మాణానికి చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీకి చెందిన దానికీ తూట్లు పొడుస్తున్నారని ఎంపీ కలిశెట్టి మండి పడుతున్నారు. మొత్తం మీద నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్మునిగిందా లేదా అనే దానికి వైసీపీ నాయకులే సమాధానం చెప్పాలి.

This post was last modified on January 12, 2026 9:15 am

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

1 hour ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

2 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

2 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

4 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

5 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

12 hours ago