అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి వ్యక్తం చేస్తారు. పదవులు దక్కని వారు అసంతృప్తిలోనే కొనసాగుతారు. కానీ, చిత్రం ఏంటంటే పదవులు దక్కిన వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారన్నది టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన సంచలన వ్యాఖ్య.
వాస్తవానికి గత ఎన్నికల సమయంలో టికెట్లను త్యాగం చేసిన చాలా మంది నాయకులకు పదవులు దక్కలేదు. వారు అసంతృప్తితో ఉన్నారంటే అందులో వాస్తవం ఉంటుంది. కొంతవరకు దానిని అర్థం చేసుకోవచ్చు.
కానీ గత ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అనేక మందికి మార్కెట్ కమిటీ చైర్మన్లుగా, బోర్డు సభ్యులుగా, అలాగే ఇతర నామినేటెడ్ పదవుల్లో వందల మందిని నియమించారు. అయినప్పటికీ ఆ నాయకులు అసంతృప్తితోనే కొనసాగుతున్నారన్నది గోరంట్ల చెప్పిన మాట.
నిజానికి పదవులు పొందిన వారికి ఎంతో కొంత ప్రాధాన్యం ఉంటూనే ఉంటుంది. మరి ఎందుకు వారిలో అసంతృప్తి నెలకొంది అంటే, తాము కోరుకున్న పదవులు ఇవ్వలేదన్నదే కారణం.
ఇలా చేసుకుంటూ పోతే ఇక రాష్ట్రంలో ఉన్న పదవులన్నీ కోరుకున్న వారికే ఇచ్చుకుంటూ వెళ్తే మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు పదవులు దక్కని వారు ఎలాగో అసంతృప్తితోనే ఉన్నారు. వీరిలో కొంతమంది మాత్రమే ఎప్పుడో ఒకప్పుడు పదవి దక్కుతుందన్న ఆశతో ముందుకు సాగుతుండగా, మిగిలిన వారు మాత్రం ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.
ఇక పదవులు పొందిన వారిలో ముఖ్యంగా మంత్రి పదవులు దక్కిన వారిలో కూడా తాము కోరుకున్న శాఖలు రాలేదన్న ఆలోచనతో ఆవేదన వ్యక్తమవుతోందన్నది గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కీలక వ్యాఖ్య.
ఇది కూడా వాస్తవమే. దీనికి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు చెప్పాల్సి ఉంటుంది. కానీ సహజంగా మంత్రివర్గంలో చోటు దక్కిన వారు సంతోషంగా ఉండాలి. అలాంటిది తాము కోరుకున్న క్యాబినెట్ స్థానం రాలేదని, ఆశించిన విధంగా జరగలేదని అలకలు వహిస్తూ అసంతృప్తితో ఉంటే అది ఎంతవరకు సమంజసమన్నదే గోరంట్ల చేసిన వ్యాఖ్యల సారాంశం.
మొత్తంగా అసంతృప్తి అన్నది అంతులేని విధంగా టీడీపీని వెంటాడుతోందన్నది వాస్తవం. పదవులు పొందిన వారు, పదవులు దక్కని వారు ఇద్దరూ అసంతృప్తితో ఉండటం సరైన పరిస్థితి కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 11, 2026 1:47 pm
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…
ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…
దేశంలో ప్రస్తుతం ఎన్నికల మూడ్ నెలకొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…
ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయలపై పట్టు పెంచుకునే విధంగా కార్యాచరణ ప్రారంభించిన…