Political News

జనసేన, టీడీపీ కలిస్తే జీరో: జగన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన తర్వాత పొత్తుల గురించి పవన్ ప్రకటించారని, రెండు సున్నాలు కలిసినా….నాలుగు సున్నాలు కలిసినా…సున్నానే అని ఎద్దేవా చేశారు. ఒకరు పార్టీ పెట్టి 15 ఏళ్లయిన నియోజకవర్గంలో నాయకులు లేరని, జెండా మోసే కార్యకర్త లేడని పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. జీవితం మొత్తం చంద్రబాబును భుజాలపై మోసేందుకే సరిపోతుందంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు పవన్ కూ భాగస్వామ్యం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు తన అనుచరులకు, దత్తపుత్రుడికి ప్రభుత్వ సొమ్మును పంచి పెట్టారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజకీయం అంటే దోచుకోవడం, పంచుకోవడం, తినడం కాదని…చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫోటో చూసి పేదవాడు చిరునవ్వు చిందించాలని అన్నారు. ప్రజలతోనే వైసీపీ పొత్తు అని, గ్రామస్థాయి నుంచి ప్రజలతో వైసీపీ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని, పొత్తులపై ఆధారపడలేదని చెప్పారు.

రాబోయే ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధమని అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చిలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రారంభంలో కొందరు ఎమ్మెల్యేలు తనను తిట్టుకుని ఉండొచ్చని, ఇలా గడపగడపకు తిరగమంటున్నాడేంటి అని అనుకుని కొంత బాధపడి ఉండొచ్చని జగన్ అన్నారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకులు నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ మనది కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.

Satya

Recent Posts

పులిని చూసి వాత పెట్టుకోకూడదు

ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…

17 minutes ago

ఆటలు ఆడుతూనే ఉన్న జన నాయకుడు

రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…

30 minutes ago

దెయ్యాలంటే మనోళ్లకు ప్రేమ ఎక్కువే

ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…

2 hours ago

ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…

3 hours ago

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…

4 hours ago

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…

5 hours ago