Political News

జనసేన, టీడీపీ కలిస్తే జీరో: జగన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసిన తర్వాత పొత్తుల గురించి పవన్ ప్రకటించారని, రెండు సున్నాలు కలిసినా….నాలుగు సున్నాలు కలిసినా…సున్నానే అని ఎద్దేవా చేశారు. ఒకరు పార్టీ పెట్టి 15 ఏళ్లయిన నియోజకవర్గంలో నాయకులు లేరని, జెండా మోసే కార్యకర్త లేడని పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. జీవితం మొత్తం చంద్రబాబును భుజాలపై మోసేందుకే సరిపోతుందంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అవినీతిలో దత్తపుత్రుడు పవన్ కూ భాగస్వామ్యం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు తన అనుచరులకు, దత్తపుత్రుడికి ప్రభుత్వ సొమ్మును పంచి పెట్టారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాజకీయం అంటే దోచుకోవడం, పంచుకోవడం, తినడం కాదని…చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫోటో చూసి పేదవాడు చిరునవ్వు చిందించాలని అన్నారు. ప్రజలతోనే వైసీపీ పొత్తు అని, గ్రామస్థాయి నుంచి ప్రజలతో వైసీపీ శ్రేణులు మమేకం కావాలని పిలుపునిచ్చారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని, పొత్తులపై ఆధారపడలేదని చెప్పారు.

రాబోయే ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్య జరగబోయే యుద్ధమని అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చిలో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రారంభంలో కొందరు ఎమ్మెల్యేలు తనను తిట్టుకుని ఉండొచ్చని, ఇలా గడపగడపకు తిరగమంటున్నాడేంటి అని అనుకుని కొంత బాధపడి ఉండొచ్చని జగన్ అన్నారు. అయితే, ఇప్పుడు ఎమ్మెల్యేల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకులు నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ మనది కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.

This post was last modified on October 9, 2023 5:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

4 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

6 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

6 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

7 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago