వైసీపీ నేత, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. శంకర్ నారాయణ కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ విసిరి దాడి చేసేందుకు ప్రయత్నించారు, అయితే, అది గురితప్పి పక్కనే ఉన్న పొలాల్లో పడడంతో ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు శంకర్ నారాయణ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ దిగి నడవడం ప్రారంభించిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ విసిరాడు. అయితే, గురి తప్పడంతో ఆ డిటోనేటర్ పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయింది. పవర్ సప్లై లేకపోవడంతో అది పేలలేదని భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ గుర్తు తెలియని దుండగుడిని వైసీపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నిందితుడు గుడిపల్లి వాసి గణేష్ గా గుర్తించామని, మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని పోలీసులు అన్నారు. అయితే, ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేనని ఈ ఘటనపై శంకర్ నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డిటోనేటర్ పేలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.
This post was last modified on October 8, 2023 10:19 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…