వైసీపీ నేత, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శంకర్ నారాయణ పై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. శంకర్ నారాయణ కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ విసిరి దాడి చేసేందుకు ప్రయత్నించారు, అయితే, అది గురితప్పి పక్కనే ఉన్న పొలాల్లో పడడంతో ఎమ్మెల్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డం తండా పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు శంకర్ నారాయణ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కాన్వాయ్ దిగి నడవడం ప్రారంభించిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ విసిరాడు. అయితే, గురి తప్పడంతో ఆ డిటోనేటర్ పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయింది. పవర్ సప్లై లేకపోవడంతో అది పేలలేదని భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ గుర్తు తెలియని దుండగుడిని వైసీపీ కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నిందితుడు గుడిపల్లి వాసి గణేష్ గా గుర్తించామని, మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని పోలీసులు అన్నారు. అయితే, ఇది ముమ్మాటికీ హత్యాయత్నమేనని ఈ ఘటనపై శంకర్ నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డిటోనేటర్ పేలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.
This post was last modified on October 8, 2023 10:19 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…