Political News

కలెక్టర్ మీటింగ్ పెడితే.. ఉద్యోగులు ఏం చేశారంటే?

ఇది కరోనా కాలం. ప్రభుత్వ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ఓ అత్యవసర సమావేశం నిర్వహించారు.

దీనికి పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులు హాజరయ్యారు. ఐతే కలెక్టర్ సమావేశంలో సీరియస్‌గా మాట్లాడుతూ.. సిబ్బంది ఈ సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ సూచనలు ఇస్తుంటే.. ఉద్యోగులు మాత్రం అవేమీ పట్టనట్లు వాళ్ల పనిలో వాళ్లు మునిగిపోయారు.

ఓ ప్రముఖ టీవీ ఛానెల్ అక్కడ జరిగిన తతంగాన్నంతా వీడియో తీసింది. దీనిపై కథనం కూడా ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఉద్యోగుల చేసిన పనులు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

సమావేశంలో ఎక్కువగా మహిళా ఉద్యోగులే పాల్గొనగా.. వాళ్లందరూ స్మార్ట్ ఫోన్లు ఆన్ చేసి ముందు పెట్టుకున్నారు. ఒకరు జబర్దస్త్ చూస్తే, ఇంకొకరు డ్యాన్స్ షో వీక్షించారు. స్పూఫ్ వీడియోలు చూసే వాళ్లు కొందరైతే.. సినిమాలు వీక్షించేవాళ్లు ఇంకొందరు. కొందరు పడుకుని నిద్రపోతే.. ఇంకొందరు పక్క వాళ్లతో ముచ్చట్లు పెట్టుకున్నారు.

ఒక మహిళ అయితే.. నోట్ బుక్ పెట్టుకుని కలెక్టరు చెప్పేదంతా రాసుకుంటున్నట్లు కలరింగ్ ఇచ్చింది. కానీ వాస్తవంగా ఆమె చేసిన పని వేరు. తన శ్రీవారికి ఆమె ఒక ప్రేమలేఖ రాస్తూ కూర్చుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలు ఎన్నో కనిపించాయి ఆ సమావేశంలో. మొత్తం మీటింగ్ అయ్యాక మీడియా వాళ్లు అసలీ సమావేశం ఉద్దేశమేంటి.. కలెక్టరు ఏం చెప్పారో చెప్పండి అని అడిగితే.. నీళ్లు నమిలారు ఉద్యోగులు.

ఏమో తెలియదని కొందరు.. జరిగిందానికి పొంతన లేని మాటలు చెప్పి కొందరు.. మమ్మల్నెందుకు అడుగుతారు వాళ్లనడగండి అంటూ వేరే వాళ్ల వైపు మళ్లిస్తూ మరికొందరు.. ఇలా సాగింది ఆ ఉద్యోగుల వ్యవహారం.

This post was last modified on August 25, 2020 12:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Srikakulam

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

44 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago