మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. తాజాగా మరోసారి టాక్ ఆఫది టౌన్ అన్నట్టుగా వార్తల్లోకి ఎక్కారు. టీడీపీతో రాజకీయ ఓనమాలు ప్రారంభించిన మోత్కుపల్లి.. గతంలో కమ్యూనిస్టుల ఉద్యమాల్లోనూ పాల్గొన్న చరిత్రను సొంతం చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్లో ఏనాడూ… వివాదం కాని మోత్కుపల్లి.. మూడున్నరేళ్ల కిందట తొలిసారి వివాదానికి కేంద్రంగా మారారు.
ఆ వివాదం దరిమిలా.. ఆయన సాధించింది ఏమీ లేకపోయినా.. మీడియా అటెన్షన్ను మాత్రం పొందారు. ఇక, ఇప్పుడు కూడా అదే వివాదం రిపీట్. కానీ, అప్పట్లో మాదిరిగా ఇప్పుడు నేరుగా నోరు పారేసుకోకున్నా.. మనోభీష్ఠం నెరవేరని కారణంగానే ఇలా.. మోత్కుపల్లి రాజకీయ రచ్చకు కేంద్రంగా మారుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో కొనసాగుతోంది. అయితే.. ఆదిలో వచ్చిన సింపతీ.. ఇప్పుడు రాకపోవడం మోత్కుపల్లి పొలిటికల్ హిస్టరీలో మైనస్సేనని చెప్పాలి.
టీడీపీలో ఉండగా.. చంద్రబాబు తనకు గవర్నర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని.. కానీ, తనను పట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ.. మోత్కుపల్లి అప్పట్లో రచ్చ చేశారు. దీనికి కాస్త ఎస్సీల రంగు కూడా పూశారు. బాబుకు ఎస్సీలంటే గిట్టదని అందుకే తనను పక్కన పెట్టారని సెంటిమెంటు ను రాజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఇదేసమయంలో బీఆర్ఎస్ లో చేరే ప్రయత్నంలో ఉన్న ఆయన… కేసీఆర్ రాజులకే రాజు అని… ఎస్సీలకు మహరాజు అని కొనియాడారు.
తర్వాత కొన్నాళ్లకు కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తన మనోభీష్ఠమైన… గవర్నర్ గిరి కాకపోయినా.. తత్సమానమైన నామినేటెడ్ హోదా అయినా ఏదో ఒక దక్కక పోదా? అని ఎదురు చూపులు చూశారు. కానీ, ఆయన ఎదురు చూపులు ఫలించలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ అదే రాజులకు రాజైన కేసీఆర్పై నిప్పులు చెరుగుతూ.. మోత్కుపల్లి అనే ఔట్ డేటెడ్ నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు దూసుకువెళ్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డిపై నోరు పారేసుకున్న మోత్కుపల్లి.. ఇటీవల తన తమ్ముడని… తానేనాడూ ఆయనను విమర్శించలేదని చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా కాంగ్రెస్లో చేరే ప్రయత్నం అయితే.. గట్టిగానే చేస్తున్నారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇక్కడైనా.. మోత్కుపల్లి వారి మనోభీష్ఠం నెరవేరుతుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on September 29, 2023 9:51 pm
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…