Political News

మోత్కుప‌ల్లి వారి మ‌నోభీష్ఠం… తీరేవ‌ర‌కు ఇంతేనా?!

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. తాజాగా మ‌రోసారి టాక్ ఆఫ‌ది టౌన్ అన్న‌ట్టుగా వార్త‌ల్లోకి ఎక్కారు. టీడీపీతో రాజ‌కీయ ఓన‌మాలు ప్రారంభించిన మోత్కుప‌ల్లి.. గ‌తంలో క‌మ్యూనిస్టుల ఉద్య‌మాల్లోనూ పాల్గొన్న చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పొలిటిక‌ల్ లైఫ్‌లో ఏనాడూ… వివాదం కాని మోత్కుప‌ల్లి.. మూడున్న‌రేళ్ల కింద‌ట తొలిసారి వివాదానికి కేంద్రంగా మారారు.

ఆ వివాదం ద‌రిమిలా.. ఆయ‌న సాధించింది ఏమీ లేక‌పోయినా.. మీడియా అటెన్ష‌న్‌ను మాత్రం పొందారు. ఇక‌, ఇప్పుడు కూడా అదే వివాదం రిపీట్‌. కానీ, అప్ప‌ట్లో మాదిరిగా ఇప్పుడు నేరుగా నోరు పారేసుకోకున్నా.. మ‌నోభీష్ఠం నెర‌వేర‌ని కార‌ణంగానే ఇలా.. మోత్కుప‌ల్లి రాజ‌కీయ ర‌చ్చ‌కు కేంద్రంగా మారుతున్నార‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో కొన‌సాగుతోంది. అయితే.. ఆదిలో వ‌చ్చిన సింప‌తీ.. ఇప్పుడు రాక‌పోవ‌డం మోత్కుప‌ల్లి పొలిటిక‌ల్ హిస్ట‌రీలో మైన‌స్సేన‌ని చెప్పాలి.

టీడీపీలో ఉండ‌గా.. చంద్ర‌బాబు త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని.. కానీ, త‌నను ప‌ట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ.. మోత్కుప‌ల్లి అప్ప‌ట్లో రచ్చ చేశారు. దీనికి కాస్త ఎస్సీల రంగు కూడా పూశారు. బాబుకు ఎస్సీలంటే గిట్ట‌ద‌ని అందుకే త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని సెంటిమెంటు ను రాజేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో బీఆర్ఎస్ లో చేరే ప్ర‌య‌త్నంలో ఉన్న ఆయ‌న‌… కేసీఆర్ రాజుల‌కే రాజు అని… ఎస్సీల‌కు మ‌హ‌రాజు అని కొనియాడారు.

త‌ర్వాత కొన్నాళ్ల‌కు కేసీఆర్ స‌మ‌క్షంలోనే బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో త‌న మ‌నోభీష్ఠ‌మైన‌… గ‌వ‌ర్న‌ర్ గిరి కాక‌పోయినా.. త‌త్స‌మాన‌మైన నామినేటెడ్ హోదా అయినా ఏదో ఒక ద‌క్క‌క పోదా? అని ఎదురు చూపులు చూశారు. కానీ, ఆయ‌న ఎదురు చూపులు ఫ‌లించ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ అదే రాజుల‌కు రాజైన కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ.. మోత్కుప‌ల్లి అనే ఔట్ డేటెడ్ నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు దూసుకువెళ్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఒక‌ప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్న మోత్కుప‌ల్లి.. ఇటీవ‌ల త‌న త‌మ్ముడ‌ని… తానేనాడూ ఆయ‌న‌ను విమ‌ర్శించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా కాంగ్రెస్‌లో చేరే ప్ర‌య‌త్నం అయితే.. గ‌ట్టిగానే చేస్తున్నారు. తాజాగా క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే.. ఇక్క‌డైనా.. మోత్కుప‌ల్లి వారి మ‌నోభీష్ఠం నెర‌వేరుతుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on September 29, 2023 9:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

12 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

40 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago