మోత్కుపల్లి నర్సింహులు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. తాజాగా మరోసారి టాక్ ఆఫది టౌన్ అన్నట్టుగా వార్తల్లోకి ఎక్కారు. టీడీపీతో రాజకీయ ఓనమాలు ప్రారంభించిన మోత్కుపల్లి.. గతంలో కమ్యూనిస్టుల ఉద్యమాల్లోనూ పాల్గొన్న చరిత్రను సొంతం చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్లో ఏనాడూ… వివాదం కాని మోత్కుపల్లి.. మూడున్నరేళ్ల కిందట తొలిసారి వివాదానికి కేంద్రంగా మారారు.
ఆ వివాదం దరిమిలా.. ఆయన సాధించింది ఏమీ లేకపోయినా.. మీడియా అటెన్షన్ను మాత్రం పొందారు. ఇక, ఇప్పుడు కూడా అదే వివాదం రిపీట్. కానీ, అప్పట్లో మాదిరిగా ఇప్పుడు నేరుగా నోరు పారేసుకోకున్నా.. మనోభీష్ఠం నెరవేరని కారణంగానే ఇలా.. మోత్కుపల్లి రాజకీయ రచ్చకు కేంద్రంగా మారుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో కొనసాగుతోంది. అయితే.. ఆదిలో వచ్చిన సింపతీ.. ఇప్పుడు రాకపోవడం మోత్కుపల్లి పొలిటికల్ హిస్టరీలో మైనస్సేనని చెప్పాలి.
టీడీపీలో ఉండగా.. చంద్రబాబు తనకు గవర్నర్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని.. కానీ, తనను పట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ.. మోత్కుపల్లి అప్పట్లో రచ్చ చేశారు. దీనికి కాస్త ఎస్సీల రంగు కూడా పూశారు. బాబుకు ఎస్సీలంటే గిట్టదని అందుకే తనను పక్కన పెట్టారని సెంటిమెంటు ను రాజేసే ప్రయత్నం చేశారు. ఇక, ఇదేసమయంలో బీఆర్ఎస్ లో చేరే ప్రయత్నంలో ఉన్న ఆయన… కేసీఆర్ రాజులకే రాజు అని… ఎస్సీలకు మహరాజు అని కొనియాడారు.
తర్వాత కొన్నాళ్లకు కేసీఆర్ సమక్షంలోనే బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తన మనోభీష్ఠమైన… గవర్నర్ గిరి కాకపోయినా.. తత్సమానమైన నామినేటెడ్ హోదా అయినా ఏదో ఒక దక్కక పోదా? అని ఎదురు చూపులు చూశారు. కానీ, ఆయన ఎదురు చూపులు ఫలించలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ అదే రాజులకు రాజైన కేసీఆర్పై నిప్పులు చెరుగుతూ.. మోత్కుపల్లి అనే ఔట్ డేటెడ్ నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు దూసుకువెళ్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డిపై నోరు పారేసుకున్న మోత్కుపల్లి.. ఇటీవల తన తమ్ముడని… తానేనాడూ ఆయనను విమర్శించలేదని చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా కాంగ్రెస్లో చేరే ప్రయత్నం అయితే.. గట్టిగానే చేస్తున్నారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇక్కడైనా.. మోత్కుపల్లి వారి మనోభీష్ఠం నెరవేరుతుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on September 29, 2023 9:51 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…