Political News

మోత్కుప‌ల్లి వారి మ‌నోభీష్ఠం… తీరేవ‌ర‌కు ఇంతేనా?!

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. తాజాగా మ‌రోసారి టాక్ ఆఫ‌ది టౌన్ అన్న‌ట్టుగా వార్త‌ల్లోకి ఎక్కారు. టీడీపీతో రాజ‌కీయ ఓన‌మాలు ప్రారంభించిన మోత్కుప‌ల్లి.. గ‌తంలో క‌మ్యూనిస్టుల ఉద్య‌మాల్లోనూ పాల్గొన్న చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పొలిటిక‌ల్ లైఫ్‌లో ఏనాడూ… వివాదం కాని మోత్కుప‌ల్లి.. మూడున్న‌రేళ్ల కింద‌ట తొలిసారి వివాదానికి కేంద్రంగా మారారు.

ఆ వివాదం ద‌రిమిలా.. ఆయ‌న సాధించింది ఏమీ లేక‌పోయినా.. మీడియా అటెన్ష‌న్‌ను మాత్రం పొందారు. ఇక‌, ఇప్పుడు కూడా అదే వివాదం రిపీట్‌. కానీ, అప్ప‌ట్లో మాదిరిగా ఇప్పుడు నేరుగా నోరు పారేసుకోకున్నా.. మ‌నోభీష్ఠం నెర‌వేర‌ని కార‌ణంగానే ఇలా.. మోత్కుప‌ల్లి రాజ‌కీయ ర‌చ్చ‌కు కేంద్రంగా మారుతున్నార‌నే చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో కొన‌సాగుతోంది. అయితే.. ఆదిలో వ‌చ్చిన సింప‌తీ.. ఇప్పుడు రాక‌పోవ‌డం మోత్కుప‌ల్లి పొలిటిక‌ల్ హిస్ట‌రీలో మైన‌స్సేన‌ని చెప్పాలి.

టీడీపీలో ఉండ‌గా.. చంద్ర‌బాబు త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ఇప్పిస్తాన‌ని హామీ ఇచ్చార‌ని.. కానీ, త‌నను ప‌ట్టించుకోకుండా అన్యాయం చేశారంటూ.. మోత్కుప‌ల్లి అప్ప‌ట్లో రచ్చ చేశారు. దీనికి కాస్త ఎస్సీల రంగు కూడా పూశారు. బాబుకు ఎస్సీలంటే గిట్ట‌ద‌ని అందుకే త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని సెంటిమెంటు ను రాజేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో బీఆర్ఎస్ లో చేరే ప్ర‌య‌త్నంలో ఉన్న ఆయ‌న‌… కేసీఆర్ రాజుల‌కే రాజు అని… ఎస్సీల‌కు మ‌హ‌రాజు అని కొనియాడారు.

త‌ర్వాత కొన్నాళ్ల‌కు కేసీఆర్ స‌మ‌క్షంలోనే బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో త‌న మ‌నోభీష్ఠ‌మైన‌… గ‌వ‌ర్న‌ర్ గిరి కాక‌పోయినా.. త‌త్స‌మాన‌మైన నామినేటెడ్ హోదా అయినా ఏదో ఒక ద‌క్క‌క పోదా? అని ఎదురు చూపులు చూశారు. కానీ, ఆయ‌న ఎదురు చూపులు ఫ‌లించ‌లేదు. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ అదే రాజుల‌కు రాజైన కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతూ.. మోత్కుప‌ల్లి అనే ఔట్ డేటెడ్ నేత ఇప్పుడు కాంగ్రెస్ వైపు దూసుకువెళ్తోందని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఒక‌ప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డిపై నోరు పారేసుకున్న మోత్కుప‌ల్లి.. ఇటీవ‌ల త‌న త‌మ్ముడ‌ని… తానేనాడూ ఆయ‌న‌ను విమ‌ర్శించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. అంటే.. మొత్తంగా కాంగ్రెస్‌లో చేరే ప్ర‌య‌త్నం అయితే.. గ‌ట్టిగానే చేస్తున్నారు. తాజాగా క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే.. ఇక్క‌డైనా.. మోత్కుప‌ల్లి వారి మ‌నోభీష్ఠం నెర‌వేరుతుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on September 29, 2023 9:51 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

9 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

1 hour ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

1 hour ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

2 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

2 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

3 hours ago