స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం టీడీపీతో కలిసి సాగుతామని పొత్తు ప్రకటన చేసిన తర్వాత మళ్లీ పవన్ కనిపించడం లేదనే చెప్పాలి. బాబు అరెస్టు, రిమాండ్, హైకోర్టులో పిటిషన్ కొట్టివేత, రిమాండ్ పొడిగింపు తదితర పరిణామాలు చోటు చేసుకుంటున్నా పవన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు విషయం తెలియగానే విజయవాడ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని హడావుడి చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై విమర్శలు చేశారు.
జైల్లో బాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడేమో ఏమీ పట్టనట్లు ఉండిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నట్లు తెలుస్తోంది.
జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు విషయం బీజేపీకి చెప్పకుండా పవన్ ప్రకటించడంపై బీజేపీ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు టీడీపీతో పొత్తు ప్రకటన సందర్భంగా పవన్ అన్నారు.
మరోవైపు తమను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాపు సంఘాలు కూడా పవన్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. అందుకే ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యారని చెబుతున్నారు.
This post was last modified on September 25, 2023 6:22 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…