Political News

పవన్ మౌనం.. ఆ మూడు కారణాలు?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కసారిగా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ కోసం, ప్రజల కోసం టీడీపీతో కలిసి సాగుతామని పొత్తు ప్రకటన చేసిన తర్వాత మళ్లీ పవన్ కనిపించడం లేదనే చెప్పాలి. బాబు అరెస్టు, రిమాండ్, హైకోర్టులో పిటిషన్ కొట్టివేత, రిమాండ్ పొడిగింపు తదితర పరిణామాలు చోటు చేసుకుంటున్నా పవన్ మాత్రం మౌనంగానే ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

చంద్రబాబు అరెస్టు విషయం తెలియగానే విజయవాడ వెళ్లేందుకు పవన్ ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై పడుకుని హడావుడి చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై విమర్శలు చేశారు.

జైల్లో బాబును కలిసి బయటకు వచ్చిన తర్వాత టీడీపీతో పొత్తు గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడేమో ఏమీ పట్టనట్లు ఉండిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనం వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నట్లు తెలుస్తోంది.

జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీతో జనసేన పొత్తు విషయం బీజేపీకి చెప్పకుండా పవన్ ప్రకటించడంపై బీజేపీ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు టీడీపీతో పొత్తు ప్రకటన సందర్భంగా పవన్ అన్నారు.

మరోవైపు తమను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో కాపు సంఘాలు కూడా పవన్ పై అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. అందుకే ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యారని చెబుతున్నారు.

This post was last modified on September 25, 2023 6:22 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది

ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…

1 hour ago

జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.…

2 hours ago

ఏపీలో బెట్టింగ్ మార్కెట్ ఏం చెబుతోంది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగువారి చూపంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీదనే. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఫలితాలు ఎలా…

2 hours ago

ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు !

నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను…

3 hours ago

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

4 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

4 hours ago