Political News

ఏపీలో కరోనా కేసులు@1016

కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి నెల రోజులు పూర్తయింది. లాక్ డౌన్ విధించినపుడు దేశవ్యాప్తంగా వందల్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 25వ తేదీ నాటికి 24,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

లాక్ డౌన్ కట్టుదిట్టంగా చేపట్టినప్పటికీ నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చైనా, ఇటలీ, అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే ప్రమాదకర స్థాయిలో కేసుల సంఖ్య పెరగకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇక, కరోనా కట్టడి కోసం ఏపీ సర్కార్ పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉంది.

తాజాగా, ఏపీలోని కేసులు వెయ్యి దాటాయి. గడచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. కర్నూలులో 14, గుంటూరులో 3, కడపలో 4, అనంతపురంలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాని జిల్లాగా విజయనగరం తన రికార్డును కాపాడుకుంటోంది. కర్నూలులో అత్యధికంగా 275 పాజిటివ్ కేసులు నమోదు కాగా…గుంటూరులో 209 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు.

కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, ఏపీలో కరోనా మృతుల సంఖ్య 31కి చేరింది. ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 814 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా…171 మంది కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నారు. కాగా, పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,429 కేసులు నమోదు కాగా…. 57 మంది ప్రాణాలను కోల్పోయారు. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,506కు చేరుకుంది. వీరిలో 5,063 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కి చేరుకుంది.

Satya

Recent Posts

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

25 minutes ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

45 minutes ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

46 minutes ago

ధురంధర్ స్క్రిప్ట్.. మోదీ ఆఫీసు నుంచి వచ్చిందా…?

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ దగ్గర…

2 hours ago

సీనియర్ హీరో… అరుదైన జాబితాలో చేరతాడా?

2000కు అటు, ఇటు వైభవం చూసిన ఎంతోమంది సీనియర్ హీరోలు.. తర్వాతి కాలంలో యువ కథానాయకుల పోటీని తట్టుకోలేక, మారుతున్న…

3 hours ago

శంకర్ వారసుడికిది పెద్ద ఛాలెంజ్

గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 దారుణ ఫలితాలు పక్కనపెడితే దర్శకుడు శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని…

4 hours ago