స్కిల్ ట్రైనింగ్ కేసులో అరెస్టై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా రాజకీయ నేతలే కాకుండా వివిధ వర్గాల వారు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న బాబు భద్రత, ఆరోగ్య పరిస్థితిపై సైతం పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ యువనేత నారా లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్న తలైవా చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్ష అని స్పష్టం చేశారు.
తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు. తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. తలైవా ఫోన్ కాల్, ఆయన చెప్పిన మాటలతో టీడీపీ శ్రేణులు ఖుష్ అవుతున్నాయి.
కాగా, ఇటీవలి కాలంలో టీడీపీకి సన్నిహితంగా సూపర్స్టార్ రజనీ వ్యవహరించడం ఇది రెండో సారి. కొన్ని రోజుల కిందట విజయవాడ శివారులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ప్రారంభ వేడుకలకు రజనీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్, చంద్రబాబును పొగిడారు. దీనిపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేయగా అధికార వైసీపీ తలైవాను తప్పుపట్టింది. ఎన్టీఆర్ శతజయంతి దుమారం సద్దుమణుగుతున్న సమయంలో తాజాగా బాబు అరెస్టుపై ఆయన స్పందన రాజకీయంగా తీవ్ర విమర్శలు రేగేందుకు కారణం కావచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…