మనం థియేటర్ కు ఎందుకు వెళతాం. పెద్ద తెరపై మనకు ఇష్టమైన ఎంటర్ టైన్మెంట్ ని మనసారా ఆస్వాదించేందుకు. ఎంత బిగ్ స్క్రీన్ అయితే అంత ఎంజాయ్ మెంట్ అన్న మాట. ఇప్పటిదాకా ఐమాక్స్, సూళ్లూరుపేటలో వి ఎపిక్ తెరలే పెద్దవనుకుంటున్నాం కానీ ఊహాలకు ఏ మాత్రం అందని అతి పెద్ద రాకాసి స్క్రీన్ లాస్ వెగాస్ లో అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటుకే వందల కోట్లు ఖర్చయ్యాయంటే ఎక్స్ పీరియన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని తాలూకు వీడియోలు కొన్ని ఆన్ లైన్ లో అప్పుడే హల్చల్ చేయడం మొదలుపెట్టాయి.
దీని విశేషాలు ఏంటంటే ఈ స్క్రీన్ 366 అడుగులు పొడవు 516 అడుగుల వెడల్పు ఉంటుంది. కెపాసిటీ 18 వేల 600 మంది ఒకేసారి సినిమా చూడొచ్చు. చిన్నా పెద్ద కలిపి 1 లక్ష 60 వేల స్పీకర్లు అమర్చారు. 60 ఎఫ్పిఎస్ వేగంతో 18K రెజల్యూషన్ తో కంటెంట్ ప్లే అవుతుంది. దీని మీద మూవీని రన్ చేయాలంటే ఫైల్ సైజ్ అక్షరాల 5 లక్షల GB అంటే ఒళ్ళు జలదరించక మానదు. అక్టోబర్ 6న ‘పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్’తో దీన్ని ప్రీమియర్ చేయబోతున్నారు. ఒకసారి ఇందులో చూస్తే జీవితాంతం మర్చిపోలేని అనుభూతి దక్కుతుందని నిర్వాహకులు అంటున్నారు. టికెట్ ధర ఎంతని ఇప్పుడే అడక్కండి. రివీల్ చేయలేదు. గుండెనొప్పి రావొచ్చు.
ఇందులో చాలా విశేషాలను జోడించబోతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి అత్యాధునిక ఎల్ఈడి సాంకేతికత సహాయంతో గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ని చూపిస్తారట. వినడానికి బాగానే ఉంది కానీ మన దేశంలో ఇలాంటివి ఇప్పుడప్పుడే ఊహించుకోలేం. తెలుగురాష్ట్రాల్లో మనకు ఇప్పటికీ ఒక ఒరిజినల్ ఐమ్యాక్స్ స్క్రీన్ లేదు. ఇతర చోట్ల ఉన్నవి కూడా మరీ ఇంటర్నేషనల్ క్వాలిటీ అయితే కాదు. చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి చోట్ల మాత్రం స్టాండర్డ్ ఎక్స్ పీరియన్స్ ఉంది. మరి పైన చెప్పిన స్క్రీన్లు ఇండియాకు రావాలంటే ఇంకో పాతికేళ్ళు పడుతుందేమో.
This post was last modified on September 13, 2023 6:45 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…