మనం థియేటర్ కు ఎందుకు వెళతాం. పెద్ద తెరపై మనకు ఇష్టమైన ఎంటర్ టైన్మెంట్ ని మనసారా ఆస్వాదించేందుకు. ఎంత బిగ్ స్క్రీన్ అయితే అంత ఎంజాయ్ మెంట్ అన్న మాట. ఇప్పటిదాకా ఐమాక్స్, సూళ్లూరుపేటలో వి ఎపిక్ తెరలే పెద్దవనుకుంటున్నాం కానీ ఊహాలకు ఏ మాత్రం అందని అతి పెద్ద రాకాసి స్క్రీన్ లాస్ వెగాస్ లో అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటుకే వందల కోట్లు ఖర్చయ్యాయంటే ఎక్స్ పీరియన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని తాలూకు వీడియోలు కొన్ని ఆన్ లైన్ లో అప్పుడే హల్చల్ చేయడం మొదలుపెట్టాయి.
దీని విశేషాలు ఏంటంటే ఈ స్క్రీన్ 366 అడుగులు పొడవు 516 అడుగుల వెడల్పు ఉంటుంది. కెపాసిటీ 18 వేల 600 మంది ఒకేసారి సినిమా చూడొచ్చు. చిన్నా పెద్ద కలిపి 1 లక్ష 60 వేల స్పీకర్లు అమర్చారు. 60 ఎఫ్పిఎస్ వేగంతో 18K రెజల్యూషన్ తో కంటెంట్ ప్లే అవుతుంది. దీని మీద మూవీని రన్ చేయాలంటే ఫైల్ సైజ్ అక్షరాల 5 లక్షల GB అంటే ఒళ్ళు జలదరించక మానదు. అక్టోబర్ 6న ‘పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్’తో దీన్ని ప్రీమియర్ చేయబోతున్నారు. ఒకసారి ఇందులో చూస్తే జీవితాంతం మర్చిపోలేని అనుభూతి దక్కుతుందని నిర్వాహకులు అంటున్నారు. టికెట్ ధర ఎంతని ఇప్పుడే అడక్కండి. రివీల్ చేయలేదు. గుండెనొప్పి రావొచ్చు.
ఇందులో చాలా విశేషాలను జోడించబోతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి అత్యాధునిక ఎల్ఈడి సాంకేతికత సహాయంతో గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ ని చూపిస్తారట. వినడానికి బాగానే ఉంది కానీ మన దేశంలో ఇలాంటివి ఇప్పుడప్పుడే ఊహించుకోలేం. తెలుగురాష్ట్రాల్లో మనకు ఇప్పటికీ ఒక ఒరిజినల్ ఐమ్యాక్స్ స్క్రీన్ లేదు. ఇతర చోట్ల ఉన్నవి కూడా మరీ ఇంటర్నేషనల్ క్వాలిటీ అయితే కాదు. చెన్నై, ముంబై, బెంగళూరు లాంటి చోట్ల మాత్రం స్టాండర్డ్ ఎక్స్ పీరియన్స్ ఉంది. మరి పైన చెప్పిన స్క్రీన్లు ఇండియాకు రావాలంటే ఇంకో పాతికేళ్ళు పడుతుందేమో.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…