జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి అనేక అంశాలపై అద్యయనంచేసి కేంద్రానికి రిపోర్టు ఇస్తుంది. రిపోర్టు ఇవ్వటంలో కేంద్రం డెడ్ లైన్ ఏమీ పెట్టలేదు. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింత్ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్ సభా నేత అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, 15వ ఆర్ధికసంఘం ఛైర్మన్ ఎస్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, సుప్రింకోర్టు లాయర్ హరీష్ సాల్వే, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ సంజయ్ కొఠారీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటిలో ఉండేందుకు కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ నిరాకరించారు. మరి ఈ స్ధానంలో కేంద్రం ఎవరిని వేస్తుందో చూడాలి. విషయం ఏమిటంటే కమిటిలో ఒక్కళ్ళంటే ఒక్కళు కూడా నరేంద్రమోడీ ఆలోచనలకు భిన్నంతా నడుచుకునే వాళ్ళు లేరు. మోడీ ఏమిచెబితే దానికి తలూపేవాళ్ళే. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు భిన్నంగా ఆలోచించినా మెజారిటి నిర్ణయం పేరుతో వాళ్ళ అభిప్రాయాలను పట్టించుకోరు.
మోడీ జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్లుగా సిఫారసులు చేయటానికి ఒక కమిటీని నియమించిరాంతే. జమిలి ఎన్నికల నిర్వహణలో చాలా సమస్యలున్నాయి. అవన్నీ అందరికీ తెలిసిందే. ఇదే విషయమై గతంలోనే ప్రతిపక్షాలతో మాట్లాడి, అనేకమంది అభిప్రాయాలను తీసుకున్నది కేంద్ర ఎన్నికల కమీషన్. అసలీ కమిటిలో 15వ ఆర్ధికసంఘం ఛైర్మన్ కు, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ కు, సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమీషనర్ కు చోటు కల్పించాల్సిన అవసరమే లేదు.
కమిటిలో ఉండాల్సింది ప్రతిపక్ష నేతలు, కేంద్ర ఎన్నికల కమీషన్ లో పనిచేసిన చీఫ్ కమీషనర్ లేదా కమీషనర్లు. ఉన్నత హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన ముగ్గురిని కమిటిలో వేశారంటేనే కేంద్రం చిత్తశుద్ది ఏమిటో అర్ధమైపోతోంది. అందుకనే మోడీ ఫిక్సయిపోయారు కాబట్టి జమిలి ఎన్నికలు ఖాయమని అర్ధమైపోతోంది. కాకపోతే ఆ ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూడాల్సిందే.
This post was last modified on September 3, 2023 2:32 pm
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గత రెండు రోజులుగా నిరవధిక…
కొత్త తరం దర్శకులతో పని చేసేందుకు చిరంజీవి పరుగులు పెడుతున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా రజనీకాంత్ రూటు పట్టి విజయాలు…
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక, సోషల్ మీడియాలో అయితే మల్లారెడ్డి…
అసలే వేసవి కాలం.. సాధారణ ఇళ్లలో ఫాన్లు.. మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు, ఆపై తరగతుల ఇళ్లలో ఏసీలు కనీసంలో కనీసం…