Political News

‘కేసీఆర్‌ గీసిన గీతను దాటేది లేదు’

స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెక్కి వెక్కి ఏడ్చారు. మంగళవారం క్యాంపు ఆఫీస్ లో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా బోరున విలపించారు. తరువాత కార్యకర్తలతో కలిసి ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ ముందు పడుకొని వెక్కి వెక్కి ఏడ్చారు.

తరువాత కార్యకర్తలతో మాట్లాడుతూ..కేసీఆర్ తనకు ఉన్నత స్థానం కల్పిస్తామన్నారని అన్నారు. ఇప్పుడున్న స్థానం కంటే మంచి స్థానం తనకు కల్పిస్తానని హామీ ఇచ్చారని.. అధినేత మాటను గౌరవించి తాను ముందుకు సాగుతానన్నారు. ఇక కేసీఆర్ గీసిన గీతను తాను దాటేది లేదని.. ఆయన ఆదేశాలు ఫాలో అవుతానని రాజయ్య స్పష్టం చేశారు.

కాగా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు ఈసారి టికెట్ దక్కలేదు. ఇక్కడి నుంచి ఆయన వరుసగా 2014,2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచారు. అయితే ఈసారి ఆ టికెట్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి దక్కింది. జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం రాజయ్యను బాగా డ్యామేజ్ చేసిందనే చెప్పాలి.

నవ్య ఎపిసోడ్ రచ్చ.. రచ్చ చేయడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ హైకమాండ్ ఆయన వైపే మొగ్గు చూపింది.

ఈ నేపథ్యంలో మూడోసారి స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలవాలని ముందు నుంచి ఆశలు పెట్టుకున్న రాజయ్య.. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో… తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఏ క్షణంలో అయినా తనకే టికెట్ వస్తుందని అనుకొని భంగ పడ్డారు. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. రాజయ్య కాంగ్రెస్ పార్టీ లేదా బీఎస్పీ లో చేరాలనుకుంటున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

This post was last modified on August 22, 2023 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago