ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఖుషి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ముందు అఫ్ ది రికార్డు దీనికి క్లీన్ యు వచ్చిందని కొందరు యూనిట్ సభ్యులు అన్నారు కానీ వాస్తవానికి యు/ఏ తెచ్చుకుంది. అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయన్న మాట. ఇక లెన్త్ విషయానికి వస్తే ఖుషి ఫైనల్ కట్ 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు. మాములుగా లవ్, రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాలకు ఇది ఎక్కువే. చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంతసేపు థియేటర్లలో కూర్చునేందుకు సుముఖంగా లేరు.
అలాంటిది దర్శకుడు శివ నిర్వాణ ఇంత డిసైడ్ చేశారంటే ఏదో ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. దేవుడిని నమ్మని ఒక నాస్తికుడి కొడుకు, తెల్లారితే మొదలు దైవ ధ్యానం తప్ప మరో ప్రపంచం తెలియని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా ఖుషిని రూపొందించారు. హేశం అబ్దుల్ వహాబ్ పాటలు మ్యూజిక్ లవర్స్ కు బాగానే చేరాయి. అయితే నిడివి విషయంలో రాజీ పడకపోవడం వల్ల గతంలో నాని అంటే సుందరానికి ఎంత డ్యామేజ్ అయ్యిందో ఫ్యాన్స్ మరిచిపోలేదు. ట్రిమ్ చేసి ఉంటే మెరుగైన ఫలితం దక్కేదని ఇప్పటికీ అనుకుంటారు
మరి ఖుషి మేకర్స్ ప్లానింగ్ ప్రకారమే ఈ డ్యూరేషన్ కి సిద్దపడ్డారా లేక చూద్దాం ఒక ట్రయల్ వేద్దామని ఓకే అన్నారా వేచి చూస్తే కానీ అర్థం కాదు. సమంతకు శాకుంతలం పెద్ద షాక్ ఇచ్చాక ఆశలన్నీ దీని మీదే పెట్టుకుంది. చికిత్స కోసం ఏడాది వరకు గ్యాప్ తీసుకోనుంది కాబట్టి ఖుషి బ్లాక్ బస్టర్ అయితే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ ఫలితం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం తను యుఎస్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పబ్లిసిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాక్ పాజిటివ్ గా వస్తే కనక కనీసం రెండు వారాలు బలమైన రన్ దక్కుతుంది. లైగర్ గాయం మర్చిపోయేందుకు విజయ్ కు ఇది చాలా అవసరం.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…