ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న ఖుషి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ముందు అఫ్ ది రికార్డు దీనికి క్లీన్ యు వచ్చిందని కొందరు యూనిట్ సభ్యులు అన్నారు కానీ వాస్తవానికి యు/ఏ తెచ్చుకుంది. అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయన్న మాట. ఇక లెన్త్ విషయానికి వస్తే ఖుషి ఫైనల్ కట్ 2 గంటల 45 నిమిషాలకు లాక్ చేశారు. మాములుగా లవ్, రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాలకు ఇది ఎక్కువే. చాలా బలమైన కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ అంతసేపు థియేటర్లలో కూర్చునేందుకు సుముఖంగా లేరు.
అలాంటిది దర్శకుడు శివ నిర్వాణ ఇంత డిసైడ్ చేశారంటే ఏదో ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. దేవుడిని నమ్మని ఒక నాస్తికుడి కొడుకు, తెల్లారితే మొదలు దైవ ధ్యానం తప్ప మరో ప్రపంచం తెలియని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా ఖుషిని రూపొందించారు. హేశం అబ్దుల్ వహాబ్ పాటలు మ్యూజిక్ లవర్స్ కు బాగానే చేరాయి. అయితే నిడివి విషయంలో రాజీ పడకపోవడం వల్ల గతంలో నాని అంటే సుందరానికి ఎంత డ్యామేజ్ అయ్యిందో ఫ్యాన్స్ మరిచిపోలేదు. ట్రిమ్ చేసి ఉంటే మెరుగైన ఫలితం దక్కేదని ఇప్పటికీ అనుకుంటారు
మరి ఖుషి మేకర్స్ ప్లానింగ్ ప్రకారమే ఈ డ్యూరేషన్ కి సిద్దపడ్డారా లేక చూద్దాం ఒక ట్రయల్ వేద్దామని ఓకే అన్నారా వేచి చూస్తే కానీ అర్థం కాదు. సమంతకు శాకుంతలం పెద్ద షాక్ ఇచ్చాక ఆశలన్నీ దీని మీదే పెట్టుకుంది. చికిత్స కోసం ఏడాది వరకు గ్యాప్ తీసుకోనుంది కాబట్టి ఖుషి బ్లాక్ బస్టర్ అయితే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ ఫలితం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం తను యుఎస్ లో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పబ్లిసిటీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాక్ పాజిటివ్ గా వస్తే కనక కనీసం రెండు వారాలు బలమైన రన్ దక్కుతుంది. లైగర్ గాయం మర్చిపోయేందుకు విజయ్ కు ఇది చాలా అవసరం.
This post was last modified on August 22, 2023 6:15 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…