Political News

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఓ రేంజి ట్రోలింగ్

అసలే వర్షాలు.. ఆపై వరద.. జనమంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమను ఆదుకునే నాథుడే లేడా? అంటూ ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ప్రభుత్వం భరోసా దక్కింది. సరే… ఈలోగా వాన తగ్గింది. రోజుల తరబడి కనిపించని సూర్యుడూ దర్శనమిచ్చాడు. సర్కారు అండతో వర్ష బీభత్సాన్ని ఎలాగైనా పూరించేసుకోవచ్చని జనం భావిస్తున్న వేళ… అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు… నెటిజన్లకు మండేలా చేసింది. ఇంకేముంది… ఆ ఎమ్మెల్యే మాడు పడిగేలా ట్రోలింగ్ మొదలైపోయింది.

భారీ వర్షాల దెబ్బకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓరుగల్లు జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. కాలనీలు చెరువులను తలపించాయి. ఎడతెరిపిలేని వర్షాలతో నగర వాసులు విలవిల్లాడారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం మంత్రి కేటీఆర్ వరంగల్‌లో పర్యటించారు. ఇతర మంత్రులతో కలిసి ముంపు ప్రాంతాలను సందర్శించిన కేటీఆర్.. వరంగల్‌లో ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వద్ద బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి పరిస్థితి చూసి చలించిపోయిన కేటీఆర్.. అందరికీ నిత్యావసరాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నానని తెలిపారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘‘రాముడి రాకతో… ఉదయించిన భాస్కరుడు… అస్తమించిన వరుణుడు… Good things happen in the presence of positive people.’’ అని ఎమ్మెల్యే తన ట్విట్టర్ ఖాతాలో తనదైన శైలి స్వామి భక్తిని ప్రదర్శించారు. అప్పటికే భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులకు లోనైన జనానికి దాస్యం ట్వీట్ చిరాకు తెప్పించింది. అంతే ఇక ట్రోలింగ్ మొదలైపోయింది. ‘ఈ మూఢనమ్మకాలు వద్దు. కేటీఆర్ కష్టపడుతున్నారు.. నేను ఒప్పుకుంటా’ అని ఓ నెటిజన్ ఒకింత సంయమనంతోనే బదులిచ్చాడు. ఆ తర్వాత ‘కొద్దిగా ముందు రమ్మంటే అయిపోయేదిగా సారూ.. ఈ వరదల తిప్పుళ్లు తప్పుతుండే’ అంటూ మరో నెటిజన్ చురకలు అంటించాడు. ‘కేటీఆర్ సారు ఎప్పటికి హైదరాబాద్ లోనే ఉంటాడు కదా! మరి అక్కడ వరుణుడు ఎందుకు అస్తమించలేదు సార్???’’ అని మరో నెటిజన్ ఎమ్మెల్యేను నిలదీసేశాడు. ‘‘రెండు రోజులు వరంగల్లొనే ఉండుమను.సూర్యుడు రాత్రి పగలు ఉదయించి నీళ్లు మొత్తం ఆవిరి ఆయి నగరం శుభ్రం అవుతుంది’’ అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు. మొత్తంగా కష్టాల వేళ స్వామిభక్తిని ప్రదర్శించిన దాస్యం నెటిజన్ల తీవ్రమైన ట్రోలింగ్ కు గురయ్యారు.

This post was last modified on August 19, 2020 1:19 pm

Share
Show comments
Published by
Satya
Tags: KTRTRS MLA

Recent Posts

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

2 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

4 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

4 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

5 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

6 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

6 hours ago