Political News

బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోం.. : పవన్‌!

విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జనవాణి’కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్ పై కుటుంబ సభ్యులు జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్.. బాలిక కిడ్నాప్ వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు ఎక్కువగా కిడ్నాప్ కు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలే ముఖ్యంగా మిస్ అవుతున్నారని చెప్పారు. ఈ కిడ్నాప్ వ్యవహారలపై ఫిర్యాదులు చేస్తే.. విత్ డ్రా చేసుకోవాలని సంబంధిత వ్యక్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పవన్ తెలిపారు. అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఎప్పటి నుంచో కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

పోలీసు శాఖ ఎందుకు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రిట్ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకోమంటున్నారని నిలదీశారు. వీరి వెనక వైసీపీ నేతలు ఉన్నారా? అని నిలదీశారు పవన్ కళ్యాణ్. బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోబోమన్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు పవన్.

అలాగే దివ్యాంగుల స్కూల్ యజమాని సైతం జనవాణి కార్యక్రమంలో ఓ ఫిర్యాదు చేశారు. తాను ఉషోదయ జంక్షన్ జీవీఎంసీ స్థలంలో కొంత భాగాన్ని లీజ్‌ కు తీసుకొని దివ్యాంగుల స్కూల్ నడిపిస్తున్నానని.. అయితే దీనిపై వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని చెప్పారు. తన స్కూల్ ని కరోనా సమయంలో మూసి వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పిల్లల కోసం ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నానన్నారు. వైసీపీ నేతల వేధింపుల కారణంగా 200 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆ స్కూల్ యాజమాన్యం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పవన్.. ఆ స్కూల్ ని మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

This post was last modified on August 17, 2023 10:23 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

20 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

22 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

5 hours ago