Political News

బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోం.. : పవన్‌!

విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జనవాణి’కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్ పై కుటుంబ సభ్యులు జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్.. బాలిక కిడ్నాప్ వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు ఎక్కువగా కిడ్నాప్ కు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలే ముఖ్యంగా మిస్ అవుతున్నారని చెప్పారు. ఈ కిడ్నాప్ వ్యవహారలపై ఫిర్యాదులు చేస్తే.. విత్ డ్రా చేసుకోవాలని సంబంధిత వ్యక్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పవన్ తెలిపారు. అమ్మాయిలు మిస్ అవుతున్నారని ఎప్పటి నుంచో కేంద్ర నిఘా సంస్థలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

పోలీసు శాఖ ఎందుకు ఈ కేసు విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రిట్ పిటిషన్ ఎందుకు విత్ డ్రా చేసుకోమంటున్నారని నిలదీశారు. వీరి వెనక వైసీపీ నేతలు ఉన్నారా? అని నిలదీశారు పవన్ కళ్యాణ్. బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోబోమన్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు పవన్.

అలాగే దివ్యాంగుల స్కూల్ యజమాని సైతం జనవాణి కార్యక్రమంలో ఓ ఫిర్యాదు చేశారు. తాను ఉషోదయ జంక్షన్ జీవీఎంసీ స్థలంలో కొంత భాగాన్ని లీజ్‌ కు తీసుకొని దివ్యాంగుల స్కూల్ నడిపిస్తున్నానని.. అయితే దీనిపై వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని చెప్పారు. తన స్కూల్ ని కరోనా సమయంలో మూసి వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పిల్లల కోసం ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నానన్నారు. వైసీపీ నేతల వేధింపుల కారణంగా 200 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆ స్కూల్ యాజమాన్యం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన పవన్.. ఆ స్కూల్ ని మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.

This post was last modified on August 17, 2023 10:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

2 hours ago

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

11 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

12 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

12 hours ago