ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినట్లే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి విజయమే లక్ష్యంగా పవన్ ఆచితూచి పోటీచేసే స్థానాన్ని ఎంపిక చేసుకుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయాన్ని ఆయన ప్రకటిస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం విశాఖలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ నెల 19 వరకూ అక్కడే ఈ యాత్ర కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న గాజువాకలో పవన్ పర్యటిస్తారు. అక్కడ బహిరంగ సభలోనూ పాల్గొంటారు. ఈ సభలోనే ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తారో లేదో అనే విషయంపై స్పష్టతనిచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాకలో పవన్ ఓడిపోయినప్పటికీ.. మరోసారి ఇక్కడి నుంచి బరిలో దిగాలని స్థానిక నేతలు ఆయన్ని కోరుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ వారాహి యాత్రకు గొప్ప రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లోనూ గోదావరి జిల్లాల్లోని ఓ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోసారి భీమవరం బరిలో దిగుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి పవన్ మనసులో ఏముందో చూడాలి. మరోసారి గాజువాక, భీమవరం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on August 12, 2023 6:00 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…