Political News

లోక్ సభలో రాహుల్ ఫ్లయింగ్ కిస్

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్, ఇరానీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, మణిపూర్ అల్లర్లపై ప్రసంగించిన అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాహుల్ పై స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ బయటకు వెళుతూ వెళుతూ తనతో పాటు బీజేపీ మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆమె షాకింగ్ ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ మహిళా మంత్రులు, ఎంపీలు ఫిర్యాదు చేశారు. రాహుల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్ లో భారతమాతను హత్య చేశారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్మృతీ ఇరానీ మండిపడ్డారు. మణిపూర్ భారత్ లో అంతర్భాగమని, దానిని ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేరని స్పష్టం చేశారు. భరతమాతను చంపేశారని సభలో ఇప్పటివరకు ఎవరు అనలేదని, రాహుల్ వ్యాఖ్యలను భారతజాతి క్షమించదని అన్నారు.

భారత్ ను హత్య చేశారని రాహుల్ వ్యాఖ్యానిస్తుంటే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరవడం విడ్డూరమని మండిపడ్డారు. రాహుల్ వంటి వింత ప్రవర్తన సభలో మునుపెన్నడూ చూడ లేదని అసహనం వ్యక్తం చేశారు. స్త్రీ వ్యతిరేకి మాత్రమే ఇలా పార్లమెంట్ లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ ఇవ్వగలరని మండిపడ్డారు. మహిళల పట్ల రాహుల్ కి ఉన్న గౌరవాన్ని, వారి వంశ చరిత్రను ఈ చర్య తెలియజేస్తుందని నిప్పులు చెరిగారు. అయితే, ఈ వీడియో ఫేక్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే రాహుల్ గాంధీ పై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు.

This post was last modified on August 10, 2023 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

19 minutes ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

1 hour ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

2 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

2 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

5 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

5 hours ago