Political News

కోర్టులను తప్పుపట్టిన ఏపీ డిప్యూటీ సీఎం

వైసీపీ నేతలు మరి తెలిసి చేస్తున్నారో, తెలియకచేస్తున్నారో గాని… పదేపదే కోర్టులను ఇబ్బంది పెట్టేలా, కోర్టులను ఆక్షేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 70 సార్లు కోర్టుల్లో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా కేవలం 14 నెలల సమయంలోనే ఇన్ని దెబ్బలు తగిలాయి. ఇక ఇటీవల వరుసగా రంగుల విషయంలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వార్నింగ్ లు కూడా వచ్చాయి.

రమేష్ కుమార్ కేసు కారణంగా కోర్టులకు వైసీపీ సర్కారుకు మధ్య దూరం పెరగ్గా, వైసీపీ నేతలకు కోర్టులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ఫోన్ ట్యాపింగ్ (తప్పుడు ప్రచారం అని ప్రభుత్వం కొట్టిపారేసింది) వ్యవహారం వైరల్ అయిన నేపథ్యంలో, సుప్రీంకోర్టులో వైసీపీ నేతలు కోర్టులపై చేసిన వ్యాఖ్యలు విచారణలో ఉన్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వాటికి ఆజ్యం పోసే వ్యాఖ్యలు చేశారు.

పేదలకు పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం ఏ మాత్రం సరైన పని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఇళ్ల స్థలాల అంశంలో కోర్టులు త్వరతిగతిన ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్టులకే ఆయన సలహా ఇచ్చారు. అంతటితో ఆగలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేయవు, పేదలకు ఇళ్లు ఇస్తాం అని మేనిఫెస్టోలో పెట్టాం… అందుకే ఇస్తున్నాం అని వ్యాఖ్యానించారు.

కోర్టులే వైసీపీ హామీలు ఆపుతున్నాయన్న అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. ఉన్నవాళ్లు భూ కబ్జాలు చేస్తారు, పేదలకు గవర్నమెంటే స్థలాలు ఇవ్వాలి కదా అని అన్నారు. ఇప్పటికే 3 తేదీలు మార్చాల్సివచ్చినందుకు చింతించారు మంత్రి గారు.

పనిలోపనిగా చంద్రబాబుపై కొన్ని విసుర్లు వేశారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. చంద్రబాబు పేదలకు ఇళ్లను అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వేరు. అమరావతి రాజధాని భూములను పేదలకు పంచొద్దని హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

This post was last modified on August 17, 2020 11:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

52 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

59 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago