Political News

సీట్లిస్తామ‌న్నా క‌ద‌ల‌డం లేదుగా… త‌మ్ముళ్ల‌లో మౌనం ఎందుకో?!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ సారి వ‌చ్చే ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తాన‌ని చెబుతున్నారు. ముందు 30 శాతం.. త‌ర్వాత ఈ ఏడాది మేలో జ‌రిగిన మ‌హానాడులో 40 శాతం మేర‌కు..యువ‌త‌కు టికెట్లు ఇస్తామ‌ని.. అంతేశాతం పార్టీలోనూ ప‌ద‌వులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

యువ‌త పెద్ద ఎత్తున స్పందించి.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అంటే.. మొత్తంగా యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు చంద్ర‌బాబురెడీగానే ఉన్నారు. 40 శాతం సీట్లు అంటే .. ఉన్న 175 నియోజ‌వ‌క‌ర్గాల్లో దాదాపు 70 మంది యువ నేత‌ల‌కు ఆయ‌న టికెట్లు ఇస్తామ‌ని చెప్పారు. ఇది చిన్న సంఖ్యేమీ కాదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో స్పందిస్తున్న యువ‌త మ‌రింత పుంజుకుంటార‌ని చంద్ర‌బాబు ఆశించారు.

కానీ, చంద్ర‌బాబు ఆశించిన‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. యువ‌త ఎక్క‌డా స్పందించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డ‌మూ లేదు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా లేదు. ఇది ప‌క్కా వాస్త‌వం. దీనిపై ఇటీవ‌ల ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో సుదీర్ఘంగా చ‌ర్చించార‌ని సీనియ‌ర్లు కూడా చెప్పారు. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు? చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌.. కూడా మౌనంగా ఉండిపోవ‌డానికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

దీనికి యువ నాయ‌కుల్లో టికెట్ల భ‌రోసా క‌లగ‌డం లేద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం, శ్రీకాకుళంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు దీనికి ఉదాహ‌ర‌ణ‌గా సీనియ‌ర్లు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిభా భార‌తి వార‌సురాలు గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. అయితే, ఆమెకు టికెట్ ఇచ్చేది లేద‌ని.. కొన్నాళ్ల కింద‌టే చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఇక‌, అనంత‌పురంలో జేసీ బ్ర‌ద‌ర్స్ వారసుల‌కు కూడా ఈ సారిటికెట్లు లేవ‌ని చూచాయ‌గా చెప్పేశారు.

అదేస‌మ‌యంలో రాప్తాడు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ప‌రిటాల శ్రీరాంకు టికెట్లు ఇచ్చేదిలేనిదీ తేల్చి చెప్ప‌లేదు. ప్ర‌స్తుతానికి రాప్తాడు టికెట్‌ను ప‌రిటాల సునీత‌కే క‌న్ఫ‌ర్మ్ చేశారు. త‌న‌కు ధ‌ర్మ‌వ‌రం టికెట్ ఇవ్వాల‌ని శ్రీరాం కోరుతున్నా.. స్పందించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో నే.. మిగిలిన యువ నేత‌లు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని సీనియ‌ర్లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on July 30, 2023 10:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

30 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

3 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago