Political News

సీట్లిస్తామ‌న్నా క‌ద‌ల‌డం లేదుగా… త‌మ్ముళ్ల‌లో మౌనం ఎందుకో?!

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ సారి వ‌చ్చే ఎన్నికల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తాన‌ని చెబుతున్నారు. ముందు 30 శాతం.. త‌ర్వాత ఈ ఏడాది మేలో జ‌రిగిన మ‌హానాడులో 40 శాతం మేర‌కు..యువ‌త‌కు టికెట్లు ఇస్తామ‌ని.. అంతేశాతం పార్టీలోనూ ప‌ద‌వులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

యువ‌త పెద్ద ఎత్తున స్పందించి.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అంటే.. మొత్తంగా యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు చంద్ర‌బాబురెడీగానే ఉన్నారు. 40 శాతం సీట్లు అంటే .. ఉన్న 175 నియోజ‌వ‌క‌ర్గాల్లో దాదాపు 70 మంది యువ నేత‌ల‌కు ఆయ‌న టికెట్లు ఇస్తామ‌ని చెప్పారు. ఇది చిన్న సంఖ్యేమీ కాదు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో స్పందిస్తున్న యువ‌త మ‌రింత పుంజుకుంటార‌ని చంద్ర‌బాబు ఆశించారు.

కానీ, చంద్ర‌బాబు ఆశించిన‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. యువ‌త ఎక్క‌డా స్పందించ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డ‌మూ లేదు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా లేదు. ఇది ప‌క్కా వాస్త‌వం. దీనిపై ఇటీవ‌ల ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో సుదీర్ఘంగా చ‌ర్చించార‌ని సీనియ‌ర్లు కూడా చెప్పారు. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు? చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత‌.. కూడా మౌనంగా ఉండిపోవ‌డానికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

దీనికి యువ నాయ‌కుల్లో టికెట్ల భ‌రోసా క‌లగ‌డం లేద‌ని అంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం, శ్రీకాకుళంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు దీనికి ఉదాహ‌ర‌ణ‌గా సీనియ‌ర్లు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిభా భార‌తి వార‌సురాలు గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. అయితే, ఆమెకు టికెట్ ఇచ్చేది లేద‌ని.. కొన్నాళ్ల కింద‌టే చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఇక‌, అనంత‌పురంలో జేసీ బ్ర‌ద‌ర్స్ వారసుల‌కు కూడా ఈ సారిటికెట్లు లేవ‌ని చూచాయ‌గా చెప్పేశారు.

అదేస‌మ‌యంలో రాప్తాడు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన ప‌రిటాల శ్రీరాంకు టికెట్లు ఇచ్చేదిలేనిదీ తేల్చి చెప్ప‌లేదు. ప్ర‌స్తుతానికి రాప్తాడు టికెట్‌ను ప‌రిటాల సునీత‌కే క‌న్ఫ‌ర్మ్ చేశారు. త‌న‌కు ధ‌ర్మ‌వ‌రం టికెట్ ఇవ్వాల‌ని శ్రీరాం కోరుతున్నా.. స్పందించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో నే.. మిగిలిన యువ నేత‌లు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని సీనియ‌ర్లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Satya

Recent Posts

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

1 hour ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

2 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

3 hours ago

పింక్ శారీలో రాశి.. చూపు తిప్పుకోవడం కష్టమే!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…

4 hours ago

ఇది టూమ‌చ్ డైరెక్టర్ గారు…

త‌మ సినిమాల మీద‌, దాని కోసం ప‌నిచేసిన‌ ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల మీద ఆయా చిత్ర బృందాల‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉండొచ్చు.…

5 hours ago

హోర్ముజ్ మ‌ళ్లీ మూత‌… ప్ర‌పంచం దిగ్భ్రాంతి!

ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌మ ప‌రిధిలో ప్ర‌పంచ వాణిజ్య నౌకార‌వాణాకు అత్యంత కీల‌క‌మైన హోర్ముజ్ జ‌ల‌సంధిని మూసి వేస్తున్న‌ట్టు…

5 hours ago