ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన యువతకు పెద్దపీట వేస్తానని చెబుతున్నారు. ముందు 30 శాతం.. తర్వాత ఈ ఏడాది మేలో జరిగిన మహానాడులో 40 శాతం మేరకు..యువతకు టికెట్లు ఇస్తామని.. అంతేశాతం పార్టీలోనూ పదవులు ఇస్తామని ప్రకటించారు.
యువత పెద్ద ఎత్తున స్పందించి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే.. మొత్తంగా యువతను ప్రోత్సహించేందుకు చంద్రబాబురెడీగానే ఉన్నారు. 40 శాతం సీట్లు అంటే .. ఉన్న 175 నియోజవకర్గాల్లో దాదాపు 70 మంది యువ నేతలకు ఆయన టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇది చిన్న సంఖ్యేమీ కాదు. దీంతో ఇప్పటి వరకు అంతో ఇంతో స్పందిస్తున్న యువత మరింత పుంజుకుంటారని చంద్రబాబు ఆశించారు.
కానీ, చంద్రబాబు ఆశించినట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. యువత ఎక్కడా స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించడమూ లేదు. ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా లేదు. ఇది పక్కా వాస్తవం. దీనిపై ఇటీవల ఎన్టీఆర్ భవన్లో సుదీర్ఘంగా చర్చించారని సీనియర్లు కూడా చెప్పారు. మరి దీనికి కారణాలు ఏంటి? ఎందుకు? చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత.. కూడా మౌనంగా ఉండిపోవడానికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీనికి యువ నాయకుల్లో టికెట్ల భరోసా కలగడం లేదని అంటున్నారు. ఉదాహరణకు అనంతపురం, శ్రీకాకుళంలో చోటు చేసుకున్న ఘటనలు దీనికి ఉదాహరణగా సీనియర్లు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతి వారసురాలు గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. అయితే, ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని.. కొన్నాళ్ల కిందటే చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక, అనంతపురంలో జేసీ బ్రదర్స్ వారసులకు కూడా ఈ సారిటికెట్లు లేవని చూచాయగా చెప్పేశారు.
అదేసమయంలో రాప్తాడు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరాంకు టికెట్లు ఇచ్చేదిలేనిదీ తేల్చి చెప్పలేదు. ప్రస్తుతానికి రాప్తాడు టికెట్ను పరిటాల సునీతకే కన్ఫర్మ్ చేశారు. తనకు ధర్మవరం టికెట్ ఇవ్వాలని శ్రీరాం కోరుతున్నా.. స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో నే.. మిగిలిన యువ నేతలు పెద్దగా స్పందించడం లేదని సీనియర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 30, 2023 10:16 pm
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…