వివేకా హత్య కేసులో ఇటీవల సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ చార్జీషీటులో వైైఎస్ సునీత చేసిన ఆరోపణలు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ హత్యకు సంబంధించి సీబీఐ అధికారులకు మాజీ సీఎస్ అజేయ కల్లం ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా ఆ చార్జిషీట్లో తాను చెప్పిన విషయాలపై అజేయ కల్లం స్పందించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులపై అజేయ కల్లం సంచలన ఆరోపణలు చేశారు.
తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను సీబీఐ మార్చేసిందని అజేయకల్లం షాకింగ్ కామెంట్లు చేశారు. 2023 ఏప్రిల్ 29న తన వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసిందని, కానీ, తాను చెప్పింది ఒకటని…ఛార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొంది మరొకటని అజేయ కల్లం అన్నారు. 2019 మార్చి 15న జగన్ నివాసంలో సమావేశం జరుగుతుండగా అటెండర్ వచ్చి డోర్ కొట్టారని అజేయకల్లం చెప్పారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్ కు ఏదో చెప్పగానే ఆయన షాక్ కు గురై లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారని అన్నారు. ఆ విషయాన్ని తాను సీబీఐకి చెప్పానని, ఇంతకు మించి మరేమీ చెప్పలేదని తెలిపారు.
సీబీఐకి తాను ఇచ్చిన వాంగ్మూలంలో జగన్ భార్య భారతి ప్రస్తావనగానీ, వేరే విషయాలనుగానీ తాను సీబీఐ విచారణలో వెల్లడించలేదని అన్నారు. తాను చెప్పనివి సీబీఐ ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, అవన్నీ అబద్ధాలేనని క్లారిటీనిచ్చారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సీబీఐ వ్యవహరిస్తోందని అన్నారు. తన స్టేట్మెంట్ గా పేర్కొన్న అంశాలను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అజేయకల్లం పిటిషన్ దాఖలు చేశారు.
This post was last modified on July 29, 2023 4:19 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…