Political News

జనసేన … ఇంకా ఇంకా స్పీడు పెంచాలండీ

జ‌న‌సేన పార్టీ విష‌యం ఏపీలో త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని.. చెబుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రు ఆపుతారో చూద్దామ‌ని కూడా అంటు న్నారు. ఓకే.. ఎవ‌రు ఆపుతారు..? ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు కాబ‌ట్టి.. ఎన్నిక‌ల్లో వారే ఎవ‌రినైనా ముందుకు న‌డిపించాలి.. లేదా వెన‌క్కి తిప్పి కొట్టాలి. సో.. ఈ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌స్తుతం జ‌న‌సేన ఊపు ఏమేర‌కు పెరిగింద‌నే చూస్తే.. ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇది కొంద‌రు జ‌న‌సేన నాయ‌కుల‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ, ప్ర‌జానాడి అలానే ఉంది మ‌రి!. గ‌త ఎన్నికల్లో జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టాల‌ని.. క‌డ‌తార‌ని.. పార్టీ నాయ‌కులు ఎక్కువ‌గానే ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఏం జ‌రిగింది? దీనిని ఎవ‌రు ఖండించినా.. వాస్త‌వాల‌ను అయితే..మ‌రుగు ప‌ర‌చ‌లేరు క‌దా! ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన ప‌రిస్థితి దారుణంగానే ఉంది. ప‌వ‌న్ తెస్తున్న ఊపు.. గాలి బుడ‌గలాగానే ఉంద‌ని క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న‌వారు చెబుతున్నారు.

ఎక్క‌డెక్క‌డ ఎలా ఉంద‌నే విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఉత్త‌ర జిల్లాల విష‌యానికి వ‌స్తే.. శ్రీకాకుళంలో గ‌రిష్టంగా జ‌న‌సేన తెచ్చుకున్న ఓట్లు 6500(ప‌వ‌న్ పోటీ చేసిన గాజువాక‌ మిన‌హా). ఇక‌, ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో 2000 ల‌ లోపే ఓట్లు పోల‌య్యాయి. ఇక‌, ఉభ‌య గోదావ‌రులు, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో గ‌రిష్ఠంగా తెచ్చుకున్న ఓట్లు 22 వేలు.(ఇక్క‌డ కూడా ప‌వ‌న్ పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం కాకుండా ) ఇక సీమ‌లో అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ఠంగా వ‌చ్చిన ఓట్లు 12 వేలు.

మ‌రి ఇలాంటి ప‌రిస్థితి నుంచి మెజారిటీ ఓటు బ్యాంకును సొంత చేసుకునేందుకు జ‌న‌సేన చాలానే క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఒంట‌రిగా పోటీ చేస్తారా? క‌లిసి కాలుదువ్వుతారా? అనేది ప‌క్క‌న పెడితే.. వ్య‌క్తిగ‌తం చూసుకుంటే.. జ‌నసేన ఓటు బ్యాంకు అయితే.. పెర‌గాల్సిన అవ‌స‌రం చాలా చాలా చాలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేవ‌లం 7 శాతం ఓటు బ్యాంకు ఉంద‌నో.. మ‌రింత పెరిగింద‌నో సంతోష ప‌డితే.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. క్షేత్ర‌స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని అంచ‌నా వేయాల‌నే పార్టీ నాయ‌కుల సూచ‌న కూడా!!

This post was last modified on July 27, 2023 12:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: Janasena

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

45 minutes ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

1 hour ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

2 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

2 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago