‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ దర్శకుడు అనుదీప్. అందులో అతను పండించిన కొత్త రకం కామెడీకి ఈ తరం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. తెర మీదే కాదు.. బయట ఏ ఈవెంట్కు వచ్చినా.. లేదా ఏదైనా టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నా.. లేదా ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనుదీప్ పంచే ఎంటర్టైన్మెంటే వేరుగా ఉంటుంది.
తన కొత్త సినిమా ‘ఫంకీ’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకప్పటి తన రూం మేట్, ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో విజయాలందుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్తో కలిసి ఒక చిట్ చాట్ లాంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అనుదీప్. ఇద్దరూ కలిసి ఒకప్పటి తమ అనుభవాలకు సంబంధించి అనేక ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఒక సందర్భంలో ఆటోకు సరిపడా డబ్బులు లేకుంటే అనుదీప్ ఏం చేశాడో వెల్లడించాడు కళ్యాణ్. నా గురించి నీకు గుర్తున్న సంఘటన చెప్పమంటే.. మనమంతా కలిసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి వెళ్లిన విషయం చెబుతా అంటూ దాని గురించి గుర్తు చేసుకున్నాడు కళ్యాణ్.
అనుదీప్, కళ్యాణ్, అండ్ గ్యాంగ్ ఆటోలో పెళ్లికి వెళ్లారట. ఐతే ఆటో ఛార్జి రూ.180 కాగా.. వీళ్ల దగ్గర రూ.140 మాత్రమే ఉన్నాయట. ఆటో దిగాక ఆ మొత్తం ఇచ్చి, డబ్బులు తగ్గినందుకు.. తమతో కలిసి వచ్చి లోపల భోజనం చేయమన్నాడట అనుదీప్. ఖద్దూకా ఖీర్ సహా మంచి మంచి స్వీట్స్ ఉంటాయని ఊరించి ఆటో డ్రైవర్ను లోపలికి తీసుకెళ్లాడట అనుదీప్.
ఇది చూసి ఇతను విజనరీ.. ఎక్కడా ఆగడు, ఏం అనుకుంటే అది సాధిస్తాడు.. ఎంతదూరమైనా వెళ్లిపోతాడు అనుకున్నానంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు కళ్యాణ్ శంకర్. విశ్వక్సేన్, కాయదు లోహర్ జంటగా అనుదీప్ రూపొందించిన ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on February 6, 2026 10:18 am
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…
ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…