పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ నేతల్లో రకరకాల టెన్షన్లు పెరిగిపోతున్నాయి. సిట్టింగులకు మళ్ళీ టికెట్లిస్తారో ఇవ్వరో అనే టెన్షన్. మొదటిసారి ఎంఎల్ఏ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవాళ్ళకి అవకాశం వస్తుందో రాదో అన్న టెన్షన్. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో రాదో అని మరికొందరిలో టెన్షన్. ఈ నేపధ్యంలోనే అవకాశం ఉన్నవారు ఇపుడే కాంగ్రెస్ అగ్రనేతలతో టికెట్ విషయంలో హామీ తీసుకుని పార్టీ మారిపోతున్నారు.
మరికొందరు నేతలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి టికెట్ విషయం తేల్చుకుని అప్పుడే పార్టీ మారుదామని ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గద్వాల జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత ఈ మధ్యనే ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. సరిత గద్వాల అసెంబ్లీకి పోటీచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో తన బలం పెంచుకోవటంలో భాగంగా సరిత భర్త తిరుపతయ్య చక్రం తిప్పారు. ఎలాగంటే గద్వాల జిల్లాలోని 42 మంది నేతలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.
చేరిన వారిలో 30 మంది సర్పంచులు, 12 మంది ఎంపీటీసీలున్నారు. ఇంకా కొందరు తొందరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకేసారి దిగువస్ధాయిలోని ప్రజాప్రతినిధులు ఇంతమంది బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని కేసీయార్ తో పాటు ఎవరు కూడా ఊహించుండరు. ఈమధ్యనే మరో సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయన నాయకత్వంలో చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.
ఇలా నియోజకవర్గాలకు నియోజకవర్గాల్లోని నేతలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి చాలా ఇబ్బందిగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ సీట్లను కాంగ్రెస్ పార్టీయే గెలుచుకోవాలని గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరినందకు సంతోషంగా ఉందని రేవంత్ అన్నారు. మొత్తానికి చాపకింద నీరులాగ రేవంత్ చాలామంది బీఆర్ఎస్ నేతలను హస్తంపార్టీలోకి లాగేసుకుంటున్నారు.
This post was last modified on July 24, 2023 10:18 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…