జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీపైనే దృష్టి పెట్టారు. మంచిదే. ఇక్కడ అధికారంలోకి రావాలని, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును కూడా చీలనివ్వబోనని ఆయన చెబుతున్నారు. సరే.. ఒక రాజకీయ పార్టీగా ఆయనకు ఉన్న స్వేచ్ఛను ఎవరూ కాదనరు. అయితే.. ఇదేసమయంలో గతంలో ఆయన తెలంగాణపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ కూడా పోటీ చేస్తుందని చెప్పారు.
మరో నాలుగు మాసాల్లో ఇక్కడ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రధాన పక్షాలు ఎన్నికల గోదాలోకి దిగిపోయి.. ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి రాజకీయ వ్యూహాల వరకు కూడా.. అధికార బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చకు వస్తోంది. మీరు కోరుకుంటే.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ చేస్తానని.. 7 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ ఉంటుందని పవన్ నాలుగు మాసాల కిందట చెప్పారు.
వారాహి వాహానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించినప్పుడు.. అక్కడే ఆ ఆలయానికి పక్కనే నిర్వహించిన వారాహి యాత్ర సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇది నిజమేనని అనుకున్న పలువురు నేతలు కూడా.. జనసేన దూకుడు పెరిగితే చేరేందుకు రెడీ అంటూ.. అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పటి వరకు కూడా.. పవన్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.
అంతేకాదు.. అసలు ఏపీ కన్నాముందు జరిగే తెలంగాణ ఎన్నికలపై ఆయన ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. పైగా పూర్తి సమయం ఏపీపైనే ఆయన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణను పవన్ వదిలేసుకున్నారా? ఇక, ఇక్కడ పోటీకి ఆయన దూరంగా ఉంటారా? అనే చర్చ సాగుతోంది. ఇదే జరిగితే.. ఆయన తెలంగాణలో ఇక పార్టీని మూసేసుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 24, 2023 6:18 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…