జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఏపీపైనే దృష్టి పెట్టారు. మంచిదే. ఇక్కడ అధికారంలోకి రావాలని, వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును కూడా చీలనివ్వబోనని ఆయన చెబుతున్నారు. సరే.. ఒక రాజకీయ పార్టీగా ఆయనకు ఉన్న స్వేచ్ఛను ఎవరూ కాదనరు. అయితే.. ఇదేసమయంలో గతంలో ఆయన తెలంగాణపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో తన పార్టీ కూడా పోటీ చేస్తుందని చెప్పారు.
మరో నాలుగు మాసాల్లో ఇక్కడ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రధాన పక్షాలు ఎన్నికల గోదాలోకి దిగిపోయి.. ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి రాజకీయ వ్యూహాల వరకు కూడా.. అధికార బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగా ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చకు వస్తోంది. మీరు కోరుకుంటే.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీ చేస్తానని.. 7 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ ఉంటుందని పవన్ నాలుగు మాసాల కిందట చెప్పారు.
వారాహి వాహానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించినప్పుడు.. అక్కడే ఆ ఆలయానికి పక్కనే నిర్వహించిన వారాహి యాత్ర సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇది నిజమేనని అనుకున్న పలువురు నేతలు కూడా.. జనసేన దూకుడు పెరిగితే చేరేందుకు రెడీ అంటూ.. అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పటి వరకు కూడా.. పవన్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.
అంతేకాదు.. అసలు ఏపీ కన్నాముందు జరిగే తెలంగాణ ఎన్నికలపై ఆయన ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు. పైగా పూర్తి సమయం ఏపీపైనే ఆయన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణను పవన్ వదిలేసుకున్నారా? ఇక, ఇక్కడ పోటీకి ఆయన దూరంగా ఉంటారా? అనే చర్చ సాగుతోంది. ఇదే జరిగితే.. ఆయన తెలంగాణలో ఇక పార్టీని మూసేసుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 24, 2023 6:18 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…