దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈరోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టయి.. జైల్లో ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పిటిషన్పై ఇప్పటికే రెండు సార్లు వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు మంగళవారం తొలికేసుగా పరిగణించి విచారించింది. ఈ క్రమంలోనే రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. ఈ బెయిల్ పిటిషన్పై గతంలో స్పందించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ, తాజాగా రాఘవరెడ్డి తరఫు న్యాయవాది.. అనారోగ్య కారణాలు కోర్టుకు చూపడంతో షరతులతో కూడిన నాలుగు వారాల బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించకపోవడం గమనార్హం.
గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. కానీ, దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెయిల్ రద్దు చేసింది. ఇక, మంగళవారం మాత్రం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తరఫున న్యాయవాదులు వ్యతిరేకించలేదు. ఇదిలావుంటే.. ఈ కేసులో ఈడీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని హైకోర్టు రాఘవరెడ్డికి షరతులు విధించింది.
అయితే.. దీనికి సంబంధించి రెండు ప్లేస్లు డిక్లేర్ చేసింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది.అదేసమయంలో చెన్నై వెళ్లినా.. అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లకూడదని ఢిల్లీ హైకోర్టు షరతులు విధించింది. పాస్పోర్టును ఇప్పటికే స్వాధీనం చేసుకున్న దరిమిలా.. దానిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కాగా, లిక్క్ స్కామ్కు సంబంధించి సౌత్ గ్రూప్లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆప్ నేతలకు చేరిన 100 కోట్ల రూపాయల్లో ఈ యన ప్రమేయం ఉందని కూడా తెలిపింది.
This post was last modified on July 19, 2023 8:34 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…