పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చాక ఆయన్నుంచి వరుసగా రీమేక్ సినిమాలే వస్తున్నాయి. ఆ సినిమాల్లో ప్రతిదానికీ ముందు బాగా నెగెటివిటీ కనిపిస్తోంది. కానీ తర్వాత నెమ్మదిగా అభిమానులు సర్దుకపోతున్నారు. రీఎంట్రీకి ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాను ఎంచుకోవడం అప్పట్లో జనాలకు అస్సలు నచ్చలేదు. కానీ వేణు శ్రీరామ్ ఉన్నంతలో ఫ్యాన్ మూమెంట్స్కు ఢోకా లేకుండా ఆ సినిమా తీశాడు. సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది.
‘భీమ్లా నాయక్’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. వీటితో పోలిస్తే ‘బ్రో’కు మరింత నెగెటివిటీ కనిపించింది. దీని ఒరిజినల్ ‘వినోదియ సిత్తం’ మంచి సినిమానే అయినా.. అదొక ప్రవచనం లాగా ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ చేసేదేముంది అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి. రిలీజ్ ముంగిట ఈ సినిమాకు ఆశించినంత బజ్, అభిమానుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించని నేపథ్యంలో తేజు ఒక ఇంటర్వ్యూలో ఫ్యాన్స్కు అభయ హస్తం ఇచ్చాడు.
‘బ్రో’ సినిమా గురించి అభిమానులు అంచనా వేసుకున్నది వేరని.. రేపు తెరపై చూడబోయేది వేరని తేజు అన్నాడు. అభిమానులు ఊహించని విధంగా, వారి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని తేజు ధీమా వ్యక్తం చేశాడు. ఒరిజినల్ చూసి సినిమా మీద ఒక అంచనాకు రావొద్దని అతను స్పష్టం చేశాడు. బేసిక్ ఐడియా మాత్రమే తీసుకుని.. దీనికి పూర్తి భిన్నమైన ట్రీట్మెంట్ ఇచ్చారని తేజు చెప్పాడు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్లు ఈ సినిమాను మార్చారని అతనన్నాడు.
ఒరిజినల్లో లీడ్ క్యారెక్టర్ ఒక మిడిలేజ్డ్ వ్యక్తి అని.. ఇక్కడ యువకుడిగా మార్చడమే కాక.. తన సమస్యలు, పరిష్కారాలు అన్నీ కూడా మారిపోయాయని తేజు తెలిపాడు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని సినిమాలో మాదిరి.. చాలా వరకు ఎంటర్టైనింగ్గా ఉండి.. చివర్లో బలమైన ఎమోషన్స్ ఉంటాయని తేజు తెలిపాడు. డైలాగులు, స్క్రీన్ ప్లేలో త్రివిక్రమ్ మార్కు స్పష్టంగా ఉంటుందని.. కానీ ఇది సముద్రఖని మార్కు సినిమా అని.. తనకు, మావయ్య పవన్ కళ్యాణ్కు ఉన్న పర్సనల్ బాండింగ్ తెరపై కనిపిస్తుందని.. సినిమాలో అదొక మేజర్ హైలైట్ అని తేజు తెలిపాడు.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…