Political News

`జ‌గ‌న్ మ‌ళ్లీ గెలిస్తే.. వాళ్ల అకౌంట్లు క్లోజ్‌`

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి గెలిస్తే..“ అంటూ.. మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తాజాగా అత్యంత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి వైసీపీ మ‌రోసారి గెలిస్తే.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత మంచి చేస్తార‌ని.. మ‌రిన్ని ప‌థ‌కాలు ఇస్తార‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీలు చెబుతున్న దానికంటే కూడా ఎక్కువ మేళ్లు చేస్తార‌ని వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా చెబుతున్నారు. అంతేకాదు..మ‌ళ్లీ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి జ‌గ‌నేన‌ని కూడా చెబుతున్నారు. ఏ వేదికెక్కినా.. ఏ మైకు ప‌ట్టినా వీరి గ‌ళం నుంచి జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుపు.. సంక్షేమం మాటే వినిపిస్తోంది.

అయితే.. తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు స‌త్యనారాయ‌ణ మ‌రో అడుగు ముందుకు వేశారు. సీఎం జ‌గ‌న్ గెలిస్తే.. అంటూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ కొందరి అకౌంట్లు సెటిల్‌ చేస్తారు. ఒక‌ర‌కంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు చూడాలి. అందుకే ఇంత మౌనంగా భ‌రిస్తున్నాం“ అని  కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయంగా దుమారం రేగుతోంది.

ఇంకా అక్క‌డితో కూడా ఆగ‌ని కొట్టు.. “సీఎం జగన్‌ని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారు. ఇది ఖాయం. ఈ సంగతిని వారు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది“ అని వార్నింగ్ ఇచ్చినంత ప‌నిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం.. ప్ర‌తిప‌క్షాల‌ను లేకుండా చేయ‌డ‌మా.. లేక ప‌నిగ‌ట్టుకుని కొన్ని పార్టీల‌ను లేకుండా చేయ‌డ‌మా? అనే చర్చ సాగుతోంది. మ‌రోవైపు వైసీపీలోనూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. “ఎవ‌రైనా రెండోసారి విజ‌యం ద‌క్కించుకుంటే ప్ర‌జ‌ల‌కు మ‌రింత మేలు చేస్తార‌ని చెప్పాలి కానీ.. మంత్రి అయి ఉండి.. ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తారా?  పార్టీకి డ్యామేజీ కాదా“ అని వైసీపీలోనే ఓ వ‌ర్గం నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.  

This post was last modified on July 19, 2023 8:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చైనాలోని ఆ రాష్ట్రమే తెలంగాణ అభివృద్ధికి స్పూర్తి

తెలంగాణ రాష్ట్రాన్ని వ‌చ్చే 2047 నాటికి 3(30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు) ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా…

20 minutes ago

ఇలాంటి సమయంలో పార్లమెంటుకు రాకపోతే ఎలా రాహుల్ జీ

కాంగ్రెస్ అగ్ర‌నేతే కాదు.. లోక్‌స‌భలో విప‌క్ష నాయ‌కుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. త‌ర‌చుగా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు…

1 hour ago

ఇడియట్స్ జోలికి ఇప్పుడెందుకు వెళ్లడం

2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…

2 hours ago

`స‌నాత‌న ధ‌ర్మం` స్టాండ్.. సాయిరెడ్డిని ర‌క్షిస్తుందా.. ?

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…

3 hours ago

సినిమా నచ్చకపోతే బాలేదని నలుగురికి చెప్పండి

ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయ‌డం అన్న‌ది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్త‌వం. ఇంట‌ర్నెట్, ఓటీటీల విప్ల‌వం వ‌ల్ల…

6 hours ago

‘ఫస్ట్ టైమ్’ ఎంపీకి ‘ఫస్ట్ ర్యాంక్’ ఎలా వచ్చింది?

టీడీపీ ఎంపీ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో రాష్ట్రంలోని 25…

7 hours ago