ఏపీ సీఎం జగన్ మరోసారి గెలిస్తే..“ అంటూ.. మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైసీపీ మరోసారి గెలిస్తే.. ప్రజలకు మరింత మంచి చేస్తారని.. మరిన్ని పథకాలు ఇస్తారని.. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న దానికంటే కూడా ఎక్కువ మేళ్లు చేస్తారని వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. అంతేకాదు..మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి జగనేనని కూడా చెబుతున్నారు. ఏ వేదికెక్కినా.. ఏ మైకు పట్టినా వీరి గళం నుంచి జగన్ మళ్లీ గెలుపు.. సంక్షేమం మాటే వినిపిస్తోంది.
అయితే.. తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరో అడుగు ముందుకు వేశారు. సీఎం జగన్ గెలిస్తే.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్ కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారు. ఒకరకంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు చూడాలి. అందుకే ఇంత మౌనంగా భరిస్తున్నాం“ అని కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
ఇంకా అక్కడితో కూడా ఆగని కొట్టు.. “సీఎం జగన్ని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారు. ఇది ఖాయం. ఈ సంగతిని వారు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది“ అని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్యల అంతరార్థం.. ప్రతిపక్షాలను లేకుండా చేయడమా.. లేక పనిగట్టుకుని కొన్ని పార్టీలను లేకుండా చేయడమా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు వైసీపీలోనూ విమర్శలు వస్తున్నాయి. “ఎవరైనా రెండోసారి విజయం దక్కించుకుంటే ప్రజలకు మరింత మేలు చేస్తారని చెప్పాలి కానీ.. మంత్రి అయి ఉండి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? పార్టీకి డ్యామేజీ కాదా“ అని వైసీపీలోనే ఓ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…