ఏపీ సీఎం జగన్ మరోసారి గెలిస్తే..“ అంటూ.. మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైసీపీ మరోసారి గెలిస్తే.. ప్రజలకు మరింత మంచి చేస్తారని.. మరిన్ని పథకాలు ఇస్తారని.. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న దానికంటే కూడా ఎక్కువ మేళ్లు చేస్తారని వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. అంతేకాదు..మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి జగనేనని కూడా చెబుతున్నారు. ఏ వేదికెక్కినా.. ఏ మైకు పట్టినా వీరి గళం నుంచి జగన్ మళ్లీ గెలుపు.. సంక్షేమం మాటే వినిపిస్తోంది.
అయితే.. తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరో అడుగు ముందుకు వేశారు. సీఎం జగన్ గెలిస్తే.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్ కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారు. ఒకరకంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు చూడాలి. అందుకే ఇంత మౌనంగా భరిస్తున్నాం“ అని కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
ఇంకా అక్కడితో కూడా ఆగని కొట్టు.. “సీఎం జగన్ని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారు. ఇది ఖాయం. ఈ సంగతిని వారు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది“ అని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్యల అంతరార్థం.. ప్రతిపక్షాలను లేకుండా చేయడమా.. లేక పనిగట్టుకుని కొన్ని పార్టీలను లేకుండా చేయడమా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు వైసీపీలోనూ విమర్శలు వస్తున్నాయి. “ఎవరైనా రెండోసారి విజయం దక్కించుకుంటే ప్రజలకు మరింత మేలు చేస్తారని చెప్పాలి కానీ.. మంత్రి అయి ఉండి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? పార్టీకి డ్యామేజీ కాదా“ అని వైసీపీలోనే ఓ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 8:19 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…