ఏపీ సీఎం జగన్ మరోసారి గెలిస్తే..“ అంటూ.. మంత్రి కొట్టు సత్యనారాయణ తాజాగా అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి వైసీపీ మరోసారి గెలిస్తే.. ప్రజలకు మరింత మంచి చేస్తారని.. మరిన్ని పథకాలు ఇస్తారని.. ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న దానికంటే కూడా ఎక్కువ మేళ్లు చేస్తారని వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. అంతేకాదు..మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి జగనేనని కూడా చెబుతున్నారు. ఏ వేదికెక్కినా.. ఏ మైకు పట్టినా వీరి గళం నుంచి జగన్ మళ్లీ గెలుపు.. సంక్షేమం మాటే వినిపిస్తోంది.
అయితే.. తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరో అడుగు ముందుకు వేశారు. సీఎం జగన్ గెలిస్తే.. అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్ కొందరి అకౌంట్లు సెటిల్ చేస్తారు. ఒకరకంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు చూడాలి. అందుకే ఇంత మౌనంగా భరిస్తున్నాం“ అని కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
ఇంకా అక్కడితో కూడా ఆగని కొట్టు.. “సీఎం జగన్ని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారు. ఇది ఖాయం. ఈ సంగతిని వారు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది“ అని వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్యల అంతరార్థం.. ప్రతిపక్షాలను లేకుండా చేయడమా.. లేక పనిగట్టుకుని కొన్ని పార్టీలను లేకుండా చేయడమా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు వైసీపీలోనూ విమర్శలు వస్తున్నాయి. “ఎవరైనా రెండోసారి విజయం దక్కించుకుంటే ప్రజలకు మరింత మేలు చేస్తారని చెప్పాలి కానీ.. మంత్రి అయి ఉండి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారా? పార్టీకి డ్యామేజీ కాదా“ అని వైసీపీలోనే ఓ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on July 19, 2023 8:19 am
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…