Political News

`జ‌గ‌న్ మ‌ళ్లీ గెలిస్తే.. వాళ్ల అకౌంట్లు క్లోజ్‌`

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రోసారి గెలిస్తే..“ అంటూ.. మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ తాజాగా అత్యంత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి వైసీపీ మ‌రోసారి గెలిస్తే.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత మంచి చేస్తార‌ని.. మ‌రిన్ని ప‌థ‌కాలు ఇస్తార‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీలు చెబుతున్న దానికంటే కూడా ఎక్కువ మేళ్లు చేస్తార‌ని వైసీపీ నాయ‌కులు త‌ర‌చుగా చెబుతున్నారు. అంతేకాదు..మ‌ళ్లీ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి జ‌గ‌నేన‌ని కూడా చెబుతున్నారు. ఏ వేదికెక్కినా.. ఏ మైకు ప‌ట్టినా వీరి గ‌ళం నుంచి జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుపు.. సంక్షేమం మాటే వినిపిస్తోంది.

అయితే.. తాజాగా డిప్యూటీ సీఎం కొట్టు స‌త్యనారాయ‌ణ మ‌రో అడుగు ముందుకు వేశారు. సీఎం జ‌గ‌న్ గెలిస్తే.. అంటూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “రెండోసారి అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ కొందరి అకౌంట్లు సెటిల్‌ చేస్తారు. ఒక‌ర‌కంగా వాళ్ల అకౌంట్లు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు చూడాలి. అందుకే ఇంత మౌనంగా భ‌రిస్తున్నాం“ అని  కొట్టు సత్యనారాయణ అన్నారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయంగా దుమారం రేగుతోంది.

ఇంకా అక్క‌డితో కూడా ఆగ‌ని కొట్టు.. “సీఎం జగన్‌ని తిట్టిన ఎవరినైనా సరే పాతాళంలోకి తొక్కేస్తారు. ఇది ఖాయం. ఈ సంగతిని వారు ఇప్పుడే తెలుసుకుంటే మంచిది“ అని వార్నింగ్ ఇచ్చినంత ప‌నిచేశారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం.. ప్ర‌తిప‌క్షాల‌ను లేకుండా చేయ‌డ‌మా.. లేక ప‌నిగ‌ట్టుకుని కొన్ని పార్టీల‌ను లేకుండా చేయ‌డ‌మా? అనే చర్చ సాగుతోంది. మ‌రోవైపు వైసీపీలోనూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. “ఎవ‌రైనా రెండోసారి విజ‌యం ద‌క్కించుకుంటే ప్ర‌జ‌ల‌కు మ‌రింత మేలు చేస్తార‌ని చెప్పాలి కానీ.. మంత్రి అయి ఉండి.. ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తారా?  పార్టీకి డ్యామేజీ కాదా“ అని వైసీపీలోనే ఓ వ‌ర్గం నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు.  

This post was last modified on July 19, 2023 8:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago