ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వారాహి 2.0 యాత్ర చేపట్టిన ఆయన తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు లింకు పెడుతూ.. ఫొటోలు, ఆధారాలతో సహా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలు విషయాలపై పవన్ విమర్శల బాణాలు సంధిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులోని ప్రభుత్వ కాలేజీ దుస్థితిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు, కాలేజీలను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని.. విద్యారంగంలో రాష్ట్రాన్ని ఎక్కడికోతీసుకువెళ్తున్నామని చెప్పుకొనే సీఎం జగన్.. ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల దుస్థితిని ఒక్కసారి పరిశీలించాలని చురకలంటించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.
“చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్“ అని పవన్ వ్యాఖ్యానించారు. పథకాలకు పేర్లు పెట్టుకుంటున్నారని.. ప్రచారం చేస్తున్నారని.. కానీ, క్షేత్రస్తాయిలో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on July 10, 2023 9:21 pm
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…
యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…
తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…
ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…