Political News

కేసీఆర్ జీ.. ఆయియే.. మోడీ నుంచి ఆహ్వానం

ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉండ‌డ‌మే కాకుండా. ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరుగుకుంటున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌ర్సెస్ తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యంలో ఆస‌క్తిక ఘ‌ట‌న చోటు చేసుకుంది. “కేసీఆర్ జీ ఆప్ ఆయియే” అంటూ.. మోడీ కార్యాల‌యం నుంచి కేసీఆర్‌కు వ‌ర్త‌మానం అందించింది. ఈ నెల 8న ప్ర‌ధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్ర‌ధాని ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్‌లో బీజేపీ నిర్వహించనున్న సభలో కూడా ఆయ‌న‌ పాల్గొంటారు. వరంగల్‌లో నిర్వహించనున్న సభకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోడీ కార్యాల‌యం నుంచి ఆహ్వానం అందింది. త‌మ‌కు త‌ప్ప‌క రావాలి! అని కూడా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి వెళ్లాలా? వ‌ద్దా? అనేది సీఎం కేసీఆర్‌ను ఇర‌కాటంలోకి నెట్టింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోడీ 4 సార్లు హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. అయితే.. ఏ ఒక్క‌సారికూడా కేసీఆర్ ఆయ‌న ను రిసీవ్ చేసుకోలేదు. పైగా.. ఆయ‌న‌తో మాట్లాడ‌నూ లేదు. ఇక‌, ఇద్ద‌రి మ‌ధ్య మాటల తూటాలు కూడా పేలాయి. మోడీ ప్ర‌భుత్వాన్ని దింపేస్తామ‌ని కేసీఆర్ అంటే.. బీఆర్ ఎస్‌కు ఓటు వేస్తే.. కేసీఆర్ కుమార్తె క‌విత లాభ‌ప‌డ‌తారు అంటూ.. ప్ర‌ధాని నిప్పులు చెరిగారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అనూహ్యంగా మోడీ కార్యాల‌యం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అంద‌డం సంల‌చ‌నంగా మారింది.

మరి ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తున్నారంటే.. కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి స్వాగతం పలికిన దాఖలాలు కూడా లేవు. జాతీయ పార్టీ ప్రారంభానికి ముందు నుంచే ప్రధాని తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మోడీ ఆహ్వానం మేర‌కు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on July 6, 2023 5:31 pm

Share

Recent Posts

ఆది నుంచీ.. `కొండా ఫ్యామిలీ` పార్టీల‌కు గుదిబండే!

ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయ‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్ర‌తిపార్టీలోనూ ఇబ్బందులు వ‌స్తే.. ప్ర‌తిపార్టీపైనా…

1 hour ago

ఎల్లమ్మ… దేవి vs ప్రసాద్

‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…

5 hours ago

సాయి రెడ్డి ‘యూపీ’ ఎజెండా ‘ఏపీ’లో పనిచేస్తుందా…?

వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

7 hours ago

బెత్లేహెమ్ కుటుంబం కనెక్ట్ అవుతుందా

మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…

7 hours ago

మ‌ళ్లీ కౌంటింగ్ చేపట్టాలి: ఓట‌మిపై కోర్టుకు స్టాలిన్‌

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌.. మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన అసెంబ్లీ…

8 hours ago

అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…

9 hours ago