ఎడమొహం పెడమొహంగా ఉండడమే కాకుండా. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ వర్సెస్ తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో ఆసక్తిక ఘటన చోటు చేసుకుంది. “కేసీఆర్ జీ ఆప్ ఆయియే” అంటూ.. మోడీ కార్యాలయం నుంచి కేసీఆర్కు వర్తమానం అందించింది. ఈ నెల 8న ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్లో బీజేపీ నిర్వహించనున్న సభలో కూడా ఆయన పాల్గొంటారు. వరంగల్లో నిర్వహించనున్న సభకు తెలంగాణ సీఎం కేసీఆర్కు మోడీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. తమకు తప్పక రావాలి! అని కూడా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అనేది సీఎం కేసీఆర్ను ఇరకాటంలోకి నెట్టింది.
ఇప్పటి వరకు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ 4 సార్లు హైదరాబాద్లో పర్యటించారు. అయితే.. ఏ ఒక్కసారికూడా కేసీఆర్ ఆయన ను రిసీవ్ చేసుకోలేదు. పైగా.. ఆయనతో మాట్లాడనూ లేదు. ఇక, ఇద్దరి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. మోడీ ప్రభుత్వాన్ని దింపేస్తామని కేసీఆర్ అంటే.. బీఆర్ ఎస్కు ఓటు వేస్తే.. కేసీఆర్ కుమార్తె కవిత లాభపడతారు అంటూ.. ప్రధాని నిప్పులు చెరిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా మోడీ కార్యాలయం నుంచి కేసీఆర్కు ఆహ్వానం అందడం సంలచనంగా మారింది.
మరి ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా అనే దానిపై తెలంగాణలో పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ హైదరాబాద్కు వస్తున్నారంటే.. కేసీఆర్ ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికిన దాఖలాలు కూడా లేవు. జాతీయ పార్టీ ప్రారంభానికి ముందు నుంచే ప్రధాని తెలంగాణలో నిర్వహించే కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మోడీ ఆహ్వానం మేరకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on July 6, 2023 5:31 pm
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…