Political News

జగన్ వల్లే మార్గదర్శి స్కాం బయటపెట్టా:ఉండవల్లి

మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంతో పాటు ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు తర్వాత పవన్ పై తాను పెద్దగా ఫోకస్ చేయలేదని, పవన్ తో మాట్లాడలేదని అన్నారు. పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదని ఒక కన్ఫ్యూషన్ ను మాత్రం క్రియేట్ చేశారని ఉండవల్లి ఆరోపించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అవకతవకల వ్యవహారంలో తాను చేసిన ఆరోపణలన్నీ నిజాలని వారే ఒప్పుకున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు

నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహరించిందని, వైసీపీ తప్ప ఏపీలోని అన్ని పార్టీలు రామోజీరావుకు మద్దతుగా నిలిచాయని ఆరోపించారు. ఈ రోజు జగన్ సీఎంగా ఉన్న సమయంలో మార్గదర్శి విషయంలో వాస్తవం ఏమిటి అన్నది ప్రజలకు తెలిసిందన్నారు. ఇక, పోలవరం డయాఫ్రమ్ వాల్ డామేజ్ బాధ్యులను ప్రభుత్వం గుర్తించాలని ఉండవల్లి కోరారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులమతాలు కలగలిపిన మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతి సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

కేంద్రం చేసిన అప్పులు లక్షల కోట్లలో ఉన్నాయని, కానీ కేంద్రాన్ని విమర్శించే, ప్రశ్నించే పరిస్థితి, ధైర్యం ఏ పార్టీకి లేవని ఉండవల్లి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అష్ట దరిద్రాలకు ఏకైక కారణం కేంద్రమే అని ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజన షోరూంను పంచుకోవడం వంటిదని, షోరూం తెలంగాణకు…వెనుక గోడౌన్ మనకు వచ్చిందని చెప్పారు. సిద్ధాంతపరమైన కాలుష్యం దేశాన్ని చుట్టేసిందని, అందులో నుంచి బయటపడితే కానీ దేశాభివృద్ధి సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

This post was last modified on July 6, 2023 4:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

5 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

5 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

5 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

7 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

8 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

9 hours ago