Political News

‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం శివసేనలో చీలిక రావడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న ఏకనాథ్ షిండే…ఉద్ధవ్ థాకరే పై తిరుగుబాటు చేసి పార్టీని, సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి మహా రాజకీయాల్లో అదే తరహా హైడ్రామా రక్తి కట్టింది.

శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఆయన అన్న కొడుకు అజిత్ పవర్ చీల్చారు. పార్టీలోనే 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసిన అజిత్ వార్ తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 30 మంది ఎన్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ ను కలిసిన అజిత్ పవార్ తనకు దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. అంతకుముందు, మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితం అజిత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు, తాజాగా అజిత్ పవార్ ఇచ్చిన షాక్ నుంచి శరద్ పవార్ తేరుకోలేకపోతున్నారట. ఏడాది సమయంలోనే ఎన్సీపీకి రెండో షాక్ తగలడం గమనార్హం. గత ఏడాది జూన్ లో షిండే మహా అఘాడీ వికాస్ ను చీల్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, అజిత్ పవర్ ఎన్సీపీలో చీలిక తేవడం ఇది తొలిసారి కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ ఆయన మద్దతు ప్రకటించారు. అప్పట్లో, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవర్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆ తర్వాత శరద్ పవార్ మంత్రాంగంతో అజిత్ వెనక్కి తగ్గారు.

This post was last modified on July 2, 2023 6:28 pm

Share
Show comments
Published by
Satya
Tags: Ajith Pawar

Recent Posts

మళ్ళీ పవన్ పై కాంగ్రెస్ ఫైర్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు భ‌గ్గుమ‌న్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కాదు.. దిష్టి…

2 hours ago

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

8 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

8 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

10 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

10 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

11 hours ago