పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న జనాకర్షణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆకర్షణను రాజకీయంగా సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శ ఆయనపై ఉంది. జనసేన పెట్టి పదేళ్లు కావస్తున్నా.. పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం, పవన్ అనుకున్న స్థాయిలో జనాల్లో తిరగపోవడం పట్ల విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలకు పవన్ దీటుగా సమాధానం చెప్పలేకపోయాడనే అభిప్రాయం జనాల్లో కూడా బలంగా ఉంది. ఐతే పవన్ అప్పుడప్పుడూ రంగంలోకి దిగినా సరే.. ఏపీలోని మిగతా ప్రధాన పార్టీలకు టెన్షన్ తప్పదు. ముఖ్యంగా అధికార వైసీపీ.. పవన్ ఏదైనా కార్యక్రమం పెట్టాడంటే చాలు.. షేక్ అయిపోతుంటుంది.
ఆ పార్టీ నేతలు పవన్ను టార్గెట్ చేసే తీరు.. ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు చూస్తేనే వాళ్ల అభద్రతా భావం బయటపడిపోతుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ మొదలుపెట్టిన వారాహి యాత్రతో అయితే వైసీపీకి కంటి మీద కునుకు ఉండట్లేదన్నది వాస్తవం.
వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు వారం కిందట మొదలైన వారాహి యాత్రకు జనాల నుంచి మామూలు స్పందన రావట్లేదు. గోదావరి ప్రాంతంలో పవన్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ వెళ్లిన చోటల్లా మహిళలు జేసీబీలు, వాహనాల మీదికి ఎక్కి ఆయనకు హారతులు పడుతున్న వైనం.. పవన్ రోడ్ షోలకు ఇసుకేస్తే రాలనంతగా తరలి వస్తున్న జనం.. ఈ దృశ్యాలు చూసి వైసీపీ టెన్షన్ పడుతూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వైసీపీ నేతలు రోజూ ఆయన్ని టార్గెట్ చేస్తున్న తీరే.. ఈ యాత్ర విషయంలో వాళ్లెంత మథనపడుతున్నారనడానికి నిదర్శనం. ప్రస్తుతానికి అనధికార మిత్ర పక్షమే అయినప్పటికీ.. పవన్ యాత్ర ఒక రకంగా టీడీపీకి సైతం ఇబ్బందికరంగా మారింది. పవన్ రంగంలోకి దిగినప్పటి నుంచి నారా లోకేష్ యువగళం యాత్ర సైడ్ లైన్ అయిపోయింది. మీడియా, సోషల్ మీడియాను మొత్తం పవనే ఆక్రమించేశాడు. చంద్రబాబు కూడా పర్యటనలు చేస్తున్నా అంతగా హైలైట్ కావట్లేదు. దీన్ని బట్టే పవన్ గ్రౌండ్లో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on June 24, 2023 1:16 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…