పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న జనాకర్షణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆకర్షణను రాజకీయంగా సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శ ఆయనపై ఉంది. జనసేన పెట్టి పదేళ్లు కావస్తున్నా.. పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం, పవన్ అనుకున్న స్థాయిలో జనాల్లో తిరగపోవడం పట్ల విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలకు పవన్ దీటుగా సమాధానం చెప్పలేకపోయాడనే అభిప్రాయం జనాల్లో కూడా బలంగా ఉంది. ఐతే పవన్ అప్పుడప్పుడూ రంగంలోకి దిగినా సరే.. ఏపీలోని మిగతా ప్రధాన పార్టీలకు టెన్షన్ తప్పదు. ముఖ్యంగా అధికార వైసీపీ.. పవన్ ఏదైనా కార్యక్రమం పెట్టాడంటే చాలు.. షేక్ అయిపోతుంటుంది.
ఆ పార్టీ నేతలు పవన్ను టార్గెట్ చేసే తీరు.. ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు చూస్తేనే వాళ్ల అభద్రతా భావం బయటపడిపోతుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ మొదలుపెట్టిన వారాహి యాత్రతో అయితే వైసీపీకి కంటి మీద కునుకు ఉండట్లేదన్నది వాస్తవం.
వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు వారం కిందట మొదలైన వారాహి యాత్రకు జనాల నుంచి మామూలు స్పందన రావట్లేదు. గోదావరి ప్రాంతంలో పవన్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ వెళ్లిన చోటల్లా మహిళలు జేసీబీలు, వాహనాల మీదికి ఎక్కి ఆయనకు హారతులు పడుతున్న వైనం.. పవన్ రోడ్ షోలకు ఇసుకేస్తే రాలనంతగా తరలి వస్తున్న జనం.. ఈ దృశ్యాలు చూసి వైసీపీ టెన్షన్ పడుతూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వైసీపీ నేతలు రోజూ ఆయన్ని టార్గెట్ చేస్తున్న తీరే.. ఈ యాత్ర విషయంలో వాళ్లెంత మథనపడుతున్నారనడానికి నిదర్శనం. ప్రస్తుతానికి అనధికార మిత్ర పక్షమే అయినప్పటికీ.. పవన్ యాత్ర ఒక రకంగా టీడీపీకి సైతం ఇబ్బందికరంగా మారింది. పవన్ రంగంలోకి దిగినప్పటి నుంచి నారా లోకేష్ యువగళం యాత్ర సైడ్ లైన్ అయిపోయింది. మీడియా, సోషల్ మీడియాను మొత్తం పవనే ఆక్రమించేశాడు. చంద్రబాబు కూడా పర్యటనలు చేస్తున్నా అంతగా హైలైట్ కావట్లేదు. దీన్ని బట్టే పవన్ గ్రౌండ్లో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on June 24, 2023 1:16 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…