Political News

‘మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు’

పొలిటిక‌ల్ క్యామెడీ కింగ్ కేఏ పాల్ తాజాగా అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో ఉన్న ప‌రిస్థితులు చూసిన త‌ర్వాత‌.. శాంతిదూత‌నైన త‌న‌నే సీఎం చేయాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేద‌ని అన్నారు. శుక్రవారం అనంత‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్ళానని.. కానీ ఆయన అక్కడ లేరని చెప్పారు. కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యానన్నారు.

వ్య‌క్తిగ‌తంగా తాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లా 100 మంది బౌన్సర్స్లతో.. చంద్రబాబులా హై సెక్కురిటీతో తిరగడంలేదని.. సింగిల్‌గా వెళుతున్నానని పాల్‌ అన్నారు. ‘‘చంద్రబాబు.. దమ్ముంటే నాతో డెబిట్‌కు రా.. ఎలాగూ లోకేష్‌కు మాట్లాడడం రాదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేష్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడు. మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు.“ అని వ్యాఖ్యానించారు.

ఇక‌, జ‌న‌సేన‌పైనా పాల్ విరుచుకుప‌డ్డారు. కేవ‌లం 15 సీట్లకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడని, దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యాల‌ని స‌వాల్ రువ్వారు. పవన్ కళ్యాణ్.. ప్రజాశాంతి పార్టీలోకి వ‌చ్చి.. జ‌న‌సేన‌ను విలీనం చెయ్యాల‌ని పిలుపునిచ్చారు. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని పాల్ విమ‌ర్శించారు.

త‌న‌ను ఓ కామెడీ కింగ్‌లాగా కొన్ని మీడియాలు చూపిస్తున్నాయని కేఏ పాల్‌ మండిపడ్డారు. ఆదాని, అంబానీలతో నార్త్ మీడియాను మోడీ కొనేశారని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో విలీనం అంటూ వ్యాఖ్యలు చేశారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యా.. కేతిరెడ్డి వద్దు, బాబు వద్దు మీరు సీఎం కావాలని అన్నారన్నారు. 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని కేఏపాల్ విమర్శలు గుప్పించారు.

This post was last modified on June 24, 2023 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago