Political News

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం జ‌గ‌న్ కామెంట్స్‌

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని, జ‌గ‌న్ త‌న స‌ర్కారును ర‌ద్దు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నార ని.. కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో(పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వాన్ని పుర‌స్క రించుకుని) ఉన్న స‌మ‌యంలోనే ఈ వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. అయితే.. తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సీఎం జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని జగన్ తేల్చిచెప్పేశారు. ఈ మేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం జ‌గ‌న్ చెప్పారు. మ‌రో 9 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని మంత్రులకు  జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ 9 నెలలు బాగా కష్టపడాలని మంత్రులకు ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పుడు కష్టపడితే మళ్లీ గెలుపు మనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ఇటీవల రాజమండ్రి మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ తేల్చిచెప్పారు.

“అవ‌న్నీమ‌న‌ల్ని, పొరుగు రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను చూసి కాపీ పేస్ట్ చేసిన హామీలు. వీటిని ప్ర‌జ‌లున‌మ్మ‌రు. అస‌లు చంద్ర‌బాబుకు విశ్వ‌స‌నీయ‌త లేదు. ఆయ‌న మ్యానిఫెస్టోకు కూడా విశ్వ‌స‌నీయ‌త ఉండ‌దు. కాబ‌ట్టి మీరేమీ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న మ్యానిఫెస్టోను సంపూర్ణంగా అమ‌లు చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల‌ప్ర‌జ‌లు కూడా ఆనందంగా ఉన్నారు. దీనినే ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లండి“ అని సీఎం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గానికి దిశానిర్దేశం చేశారు.

ఇదిలావుంటే, ఇటీవల ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా మాట్లాడారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పారు. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎద్దేవా చేసింది. ముందస్తుకు వెళ్తే ఓడిపోతామన్న భయంతో వైసీపీ వణికిపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. వైనాట్ 175 సీట్లు గెలుస్తామన్న జగన్ డాంబికాలు ఏమయ్యాయని వర్ల రామయ్య నిలదీశారు. తాజాగా  ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టీడీపీ ఎలా రియాక్ట అవుతుందో చూడాలి. 

This post was last modified on June 8, 2023 9:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

2 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

5 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago