Political News

బాబు, పవన్ పాలిటిక్స్.. జ‘గన్’ ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తులు.. ముఖ్యమంత్రి పదవి మీద కామెంట్ల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యింది లేదు. తాజాగా బాపట్ల జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విపక్ష నేత చంద్రబాబును.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలకు తన రియాక్షన్ ను తన మాటలతో చెప్పేశారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పేరు ఎత్తిన వెంటనే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదన్న జగన్.. చంద్రబాబు పేరు విన్నంతనే ఆయన వెన్నుపోటు గుర్తుకు వస్తుందన్నారు.

అదే సమయంలో పవన్ కల్యాణ్ పైనా విమర్శలు చేశారు. ‘రెండు సినిమా షూటింగ్స్ మధ్యన రాజకీయ సభలు పెట్టటానికి పవన్ కల్యాణ్ వస్తారు. అదీ బాబు కాల్షీట్లు ప్రకారమే మాట్లాడి రెండు రాళ్లు వేసి వెళతారు. ఇలాంటి వారికి ప్రజా జీవితం అంటే తెలుసా? వీరిద్దరూ అధికారంలో ఉంటే అమరావతిలో ఉంటారు. అధికారం పోతే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉంటారు’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉందన్న జగన్.. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు సంధించారు.

“చంద్ర బాబు.. ఆయన పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. నలుగురు లేపితే తప్పించి లేవలేని స్థితిలో ఉంది. రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు అయినా పవన్ కల్యాణ్ 175 సీట్లలో అభ్యర్థుల్ని కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటుకు పార్టీని అమ్ముకునే ప్యాకేజీ స్టార్. ముఖ్యమంత్రి సీటు కూడా వద్దని.. దోపిడీలో వాటా ఇస్తే చాలని పవన్ అంటున్నారు” అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు.

పొత్తులపైనా ఫైర్ అయ్యారు. “పెళ్లి చేసుకునేదీ వీరే.. విడాకులు తీసుకునేది వీరే. మళ్లీ పెళ్లి చేసుకునేదీ వీరే. దత్త తండ్రికి.. దత్తపుత్రుడికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఏ స్థాయిలో ఉందంటే మనిద్దరం కలిసి వెళదామంటే చిత్తం అంటారు. విడివిడిగా వెళదామని చంద్రబాబు చెబితే పవన్ అలాగే సార్ అంటారు. చంద్రబాబు ఏం చెబితే దానికి పవన్ సై అంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ చంద్రబాబు విజయంలా పండుగ చేసుకుంటున్నారు. అక్కడ ఓడిన బీజేపీ తమతో కలిసి రావాలని టీడీపీ కోరుకుంటోంది. ఇలాంటి నీచమైన రాజకీయం చూడాల్సి వస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంది వీరే. కాంగ్రెస్ తో అంటకాగింది వీరే. కమ్యూనిస్టులతో కలిసి సాగిందీ వీరే” అంటూ టీడీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు.. పవన్ కల్యాణ్ లది రాజకీయ పోరాటం కాదని.. అధికారం కోసం ఆరాటమన్నారు. వీరికి పేదలకు మంచి చేయాలన్న తపన లేదని.. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్నదే చూస్తారని.. దోచుకున్నది ఎలా దాచుకోవాలని.. దాచుకున్నది ఎలా పంచుకోవాలన్నదే వీరి తాపత్రయంగా పేర్కొన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు కలుస్తున్నారో ఆలోచించాలని ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్ కోరారు. తాను ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదురైనా.. ఎన్ని వ్యవస్థల్ని ప్రయోగించినా పదిహేనేళ్లలో ప్రజల తరుపేనే నిలబడ్డాను కానీ రాజీ పడలేదన్నారు. ‘మీ బిడ్డకు మీరే ధైర్యం. మిమ్మల్నే నమ్ముకున్నాడు’ అని తన గురించి..తన కమిట్ మెంట్ గురించి చెప్పుకొచ్చారు.

This post was last modified on May 16, 2023 7:23 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

2 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

2 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

3 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

3 hours ago

నేష‌న‌ల్ లెవ‌ల్‌కు రేవంత్‌.. కాంగ్రెస్‌కు హ్యాపీ

పీసీసీ అధ్య‌క్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉంద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల…

3 hours ago

బీఆర్ ఎస్‌కు భారీ షాక్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు తీర్పు

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠ‌ల్‌రావు…

4 hours ago