Political News

ప‌వ‌న్ ఎఫెక్ట్‌.. ఏపీలో ప్ర‌భుత్వం క‌దిలిందిగా!

అకాల వ‌ర్షాల‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్న రైతుల‌ను ఆదుకోవ‌డంలోఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల మైంద‌నే వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. క‌నీసం.. ధాన్యాన్ని ప‌ట్టించుకునే దిక్కుకూడా లేకుండా పోయింది. అయితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని.. ఆయ‌న వ‌స్తే.. యాగీ చేస్తార‌ని అనుకున్న ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్రాంతాల్లో హుటాహుటిన స‌రుకును ఖాళీ చేసింది. దీంతో చంద్ర‌బాబుకుఛాన్స్ ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌నే వ్యూహాన్ని ప‌న్నింది.

ఇక‌,ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రాక‌తో..  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నూ ప్ర‌భుత్వం అలానే చేస్తోంది.  ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్‌ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి రానున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన‌ రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించ‌నున్నారు.  జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు.

గ‌త రెండు రోజులుగా ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అన్నారు. అయితే.. మ‌రోవైపు.. ఏదో ఒక‌ర‌కంగా న్యాయం జ‌రుగుతోంద‌ని.. భావించిన జ‌న‌సేన నాయ‌కులు.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు వెంట‌నే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా ప‌వ‌న్ ఎఫెక్ట్‌బాగానే ప‌నిచేసింద‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on May 10, 2023 11:03 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago