Political News

ప‌వ‌న్ ఎఫెక్ట్‌.. ఏపీలో ప్ర‌భుత్వం క‌దిలిందిగా!

అకాల వ‌ర్షాల‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్న రైతుల‌ను ఆదుకోవ‌డంలోఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల మైంద‌నే వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. క‌నీసం.. ధాన్యాన్ని ప‌ట్టించుకునే దిక్కుకూడా లేకుండా పోయింది. అయితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని.. ఆయ‌న వ‌స్తే.. యాగీ చేస్తార‌ని అనుకున్న ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్రాంతాల్లో హుటాహుటిన స‌రుకును ఖాళీ చేసింది. దీంతో చంద్ర‌బాబుకుఛాన్స్ ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌నే వ్యూహాన్ని ప‌న్నింది.

ఇక‌,ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రాక‌తో..  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నూ ప్ర‌భుత్వం అలానే చేస్తోంది.  ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్‌ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి రానున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన‌ రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించ‌నున్నారు.  జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు.

గ‌త రెండు రోజులుగా ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అన్నారు. అయితే.. మ‌రోవైపు.. ఏదో ఒక‌ర‌కంగా న్యాయం జ‌రుగుతోంద‌ని.. భావించిన జ‌న‌సేన నాయ‌కులు.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు వెంట‌నే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా ప‌వ‌న్ ఎఫెక్ట్‌బాగానే ప‌నిచేసింద‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on May 10, 2023 11:03 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan Kalyan

Recent Posts

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

5 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

6 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

9 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

13 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

13 hours ago

నోటాతో పోటిపడ్డ నేతకు జగన్ రెడ్ కార్పెట్

ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…

14 hours ago