అకాల వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడంలోఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. కనీసం.. ధాన్యాన్ని పట్టించుకునే దిక్కుకూడా లేకుండా పోయింది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని.. ఆయన వస్తే.. యాగీ చేస్తారని అనుకున్న ప్రభుత్వం రెండు రోజుల కిందట చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో హుటాహుటిన సరుకును ఖాళీ చేసింది. దీంతో చంద్రబాబుకుఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరించాలనే వ్యూహాన్ని పన్నింది.
ఇక,ఇప్పుడు జనసేన అధినేత పవన్ రాకతో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నూ ప్రభుత్వం అలానే చేస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి రానున్నారు.
ఈ సందర్భంగా ఆయన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు.
గత రెండు రోజులుగా ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అన్నారు. అయితే.. మరోవైపు.. ఏదో ఒకరకంగా న్యాయం జరుగుతోందని.. భావించిన జనసేన నాయకులు.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు వెంటనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా పవన్ ఎఫెక్ట్బాగానే పనిచేసిందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on May 10, 2023 11:03 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…