Political News

ప‌వ‌న్ ఎఫెక్ట్‌.. ఏపీలో ప్ర‌భుత్వం క‌దిలిందిగా!

అకాల వ‌ర్షాల‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్న రైతుల‌ను ఆదుకోవ‌డంలోఏపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల మైంద‌నే వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. క‌నీసం.. ధాన్యాన్ని ప‌ట్టించుకునే దిక్కుకూడా లేకుండా పోయింది. అయితే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌స్తున్నార‌ని.. ఆయ‌న వ‌స్తే.. యాగీ చేస్తార‌ని అనుకున్న ప్ర‌భుత్వం రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు ప‌ర్య‌టించే ప్రాంతాల్లో హుటాహుటిన స‌రుకును ఖాళీ చేసింది. దీంతో చంద్ర‌బాబుకుఛాన్స్ ఇవ్వ‌కుండా వ్య‌వ‌హ‌రించాల‌నే వ్యూహాన్ని ప‌న్నింది.

ఇక‌,ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రాక‌తో..  ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నూ ప్ర‌భుత్వం అలానే చేస్తోంది.  ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్‌ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి రానున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న అకాల వ‌ర్షాల‌తో న‌ష్ట‌పోయిన‌ రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించ‌నున్నారు.  జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు.

గ‌త రెండు రోజులుగా ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అన్నారు. అయితే.. మ‌రోవైపు.. ఏదో ఒక‌ర‌కంగా న్యాయం జ‌రుగుతోంద‌ని.. భావించిన జ‌న‌సేన నాయ‌కులు.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు వెంట‌నే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఏదేమైనా ప‌వ‌న్ ఎఫెక్ట్‌బాగానే ప‌నిచేసింద‌నే టాక్ వినిపిస్తోంది.

Satya

Recent Posts

ఆచార్య దర్శకుడితో రామ్ చరణ్…

కొన్ని డిజాస్ట‌ర్లు ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో ప‌నిచేసిన వాళ్లంద‌రినీ జీవిత కాల చేదు జ్ఞాప‌కాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…

5 seconds ago

అఫిషియల్… తల్లి కాబోతున్న సమంత

మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…

34 minutes ago

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో…

1 hour ago

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

2 hours ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

2 hours ago

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

2 hours ago