అకాల వర్షాలతో నానా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడంలోఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందనే వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. కనీసం.. ధాన్యాన్ని పట్టించుకునే దిక్కుకూడా లేకుండా పోయింది. అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నారని.. ఆయన వస్తే.. యాగీ చేస్తారని అనుకున్న ప్రభుత్వం రెండు రోజుల కిందట చంద్రబాబు పర్యటించే ప్రాంతాల్లో హుటాహుటిన సరుకును ఖాళీ చేసింది. దీంతో చంద్రబాబుకుఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరించాలనే వ్యూహాన్ని పన్నింది.
ఇక,ఇప్పుడు జనసేన అధినేత పవన్ రాకతో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నూ ప్రభుత్వం అలానే చేస్తోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి రానున్నారు.
ఈ సందర్భంగా ఆయన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు. అయితే.. ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు.
గత రెండు రోజులుగా ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అన్నారు. అయితే.. మరోవైపు.. ఏదో ఒకరకంగా న్యాయం జరుగుతోందని.. భావించిన జనసేన నాయకులు.. అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో అధికారులు వెంటనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా పవన్ ఎఫెక్ట్బాగానే పనిచేసిందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on May 10, 2023 11:03 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…