ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు తాను వెళుతున్న దారిలో తన కారును ఆపిన సందర్భంగా ఆయనకు అనుకోని రీతిలో ఎదురైన మద్దతు ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా అమరావతి నుంచి సత్తెనపల్లి వెళుతున్న చంద్రబాబు ధరణి కోట – లింగాపురం మధ్య పొలాల్లో పని చేసుకుంటున్న రైతు కూలీల్ని చూసిన ఆయన తన వాహనాల్ని రోడ్డు పక్కన ఆపారు.
రోడ్డు మీద నుంచి పొలాల్లోకి వెళ్లిన చంద్రబాబు.. అక్కడ పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కినా తమ ఖాతాల్లోకి నగదు పడటం లేదని చెప్పగా.. వచ్చిన కూలి డబ్బులతో కుటుంబం గడుస్తుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయని.. ఖర్చులకు వస్తున్న ఆదాయం సరిపోవటం లేదని వాపోయారు.
ప్రభుత్వం పన్నుల పేరుతో వసూళ్లు చేస్తుందని.. గతంలో కౌలుకార్డుల ద్వారా రుణాలు వచ్చేవని.. ఇప్పుడు రావటం లేదని పేర్కొన్నారు. రాజధాని అమరావతి ఇక్కడే ఉంటే.. తమకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా కూలీల నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చింది. ఈసారి మీరు ముఖ్యమంత్రి కాకుంటే తాము అడుక్కోవాల్సి వస్తుందని.. తమ జీవితాలు బాగు పడాలంటే మళ్లీ మీరే రావాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనికి స్పందించిన చంద్రబాబు.. రైతు కూలీల ఆదాయం పెంచే దిశగా తాను ఆలోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
This post was last modified on April 27, 2023 12:31 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…