Political News

జగన్ మదిలో సుప్రీం గుబులు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్యమనస్కంగా ఉంటున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కొంత ఊరట లభించినట్లే అనుకున్నా సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో జగన్ కు టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే ఇచ్చినప్పటి నుంచి జగన్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. తాము ఒకటి తలిస్తే కోర్టు మరోక తీర్పు ఇస్తోందని జగన్ భావిస్తున్నారట.

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమీక్షా సమావేశాల్లో సీఎం ముభావంగా ఉంటున్నట్లు అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సమీక్షా సమావేశాల్లో తానేమీ మాట్లాడకుండా అధికారులు చెప్పినది విని ఊరుకుంటున్నారట. మీటింగ్ ఎప్పుడు అయిపోతుందా అన్న ఫీలింగ్ ఆయనలో కనిపిస్తోందని చెబుతున్నారు. సమావేశాలు జరిగినంత సేపు ఆయన ముళ్ల మీద కూర్చున్నట్లుగా మొహం పెడుతున్నారని పార్టీ వర్గాలు కూడా విశ్లేషించుకుంటున్నారు..

జగన్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. కోడి కత్తి కేసు బూమరాంగ్ అయ్యింది. ఇప్పుడు అవినాశ్ రెడ్డిని ఎలా గట్టెక్కించాలన్న ఆలోచనే జగన్ ను వెంటాడుతోంది. పెద్ద పెద్ద లాయర్లను పెట్టినా, స్వామీజీలను ప్రయోగించినా పని కావడం లేదన్న భావన ఆయనలో కనిపిస్తోంది. అందుకే కోర్టులను, ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

వివేకా కేసు తిరిగి తిరిగి తన మెడకు చుట్టుకుంటుందన్న ఆందోళన జగన్ మనసులో ఏర్పడిందని సన్నిహితులు విశ్లేషిస్తున్నారు. సీబీఐ తీరుతో జగన్ లో కొత్త భయాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు.. లాంటి అంశాలను సీబీఐ ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ఉండడంతో జగన్ అండ్ కో భయాలు పెరుగుతున్నాయి. గూగుల్ టేకౌట్ ను సీబీఐ తెరపైకి తీసుకురావడంతో అధికార పార్టీ నేతల్లో బీపీ పెరిగింది. తాడేపల్లి ప్యాలెస్ తో పాటు, పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా మొబైల్ ఫోన్లు వాడకుండా నేరుగా మనుషులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు… ప్యాలెస్ కు వచ్చే కొంతమందిని ఫోన్ తీసుకురావద్దని కూడా ముందుగానే సంకేతాలు పంపుతున్నారు. ఇంటి దగ్గరే ఫోన్లు వదిలేసి రావాలని చెబుతున్నారు. ఫోన్లను కారులో వదిలేసి వచ్చినా ఇబ్బందేనన్న ఫీలింగు వారిలో కలుగుతోంది.

జగన్ మీద మాత్రమే కాకుండా అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై సీబీఐ నిఘా ఉందని తెలియడంతో తాడే పల్లి ప్యాలెస్ తో ఎవరూ ఫోన్లో మాట్లాడకూడదని ఆదేశాలు వెళ్లినట్లుగా చెబుతున్నారు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు వివేకా హత్య కేసులో సాధ్యమైనంత తక్కువ కామెంట్స్ చేయాలని, తప్పనిసరి అనిపిస్తేనే స్పందించాలని సూచించిట్లుగా తెలుస్తోంది. గూగుల్ టేకౌట్ అంటేనే జగన్ వర్గం వణికిపోతోందని చెబుతున్నారు.

This post was last modified on April 25, 2023 7:58 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

14 minutes ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

18 minutes ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

21 minutes ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

31 minutes ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

49 minutes ago

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…

56 minutes ago