Political News

తెలంగాణాలో కూడా కర్నాటక మోడలేనా ?

తొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో కూడా కర్నాటక మోడల్ నే అమలు చేయాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయినట్లున్నారు. మేడ్చల్ బహిరంగసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్ను రద్దుచేస్తామని ప్రకటించారు. ముస్లింలకు ఇపుడు తెలంగాణాలో అమల్లో ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దుచేస్తారట.

అలా రద్దుచేసిన రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామని అమిత్ ప్రకటించారు. తెలంగాణాలో ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. సేమ్ టు సేమ్ ఇలాంటి విధానాన్నే బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటకలో ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్ను బసవరాజ బొమ్మై ప్రభుత్వం రద్దు చేసింది. అలా రద్దుచేసిన రిజర్వేషన్ శాతాన్ని ఒక్కలిగలకు 2 శాతం లింగాయతులకు మిగిలిన 2 శాతం సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే.

కర్నాటకలో ముస్లింల జనాభా గణనీయంగానే ఉంది. అయినా వాళ్ళ రిజర్వేషన్లను సరిగ్గా ఎన్నికలకు ముందు ఎందుకు రద్దుచేశారో అర్ధంకావటంలేదు. అలాగే 224 సీట్ల అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా ముస్లింలకు కేటాయించలేదు. కర్నాటక బీజేపీలో ముస్లిం నేతలున్నా కూడా ఎక్కడా ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ రెండు నిర్ణయాలు మే 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయని అందరు అనుకుంటున్నారు.

అసలే కర్నాటకలో బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది. దానికి అదనంగా ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఒక్క ముస్లిం నేతకు కూడా టికెట్ ఇవ్వకపోవటంతో మరింత సమస్యగా మారిందని సమాచారం. ఇవన్నీ ఉండగానే చాలామంది సీనియర్లకు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన జగదీష్ శెట్టర్ లాంటి వాళ్ళకు కూడా టికెట్లు దక్కలేదు. దాంతో కొందరు రెబల్ అభ్యర్ధులుగాను మరికొందరు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరి పోటీచేస్తున్నారు. మొత్తంమీద ఎన్నికల్లో బీజేపీ ఎంత కంపుచేసుకోవాలో అంతా చేసుకుంది. మరి దీనివెనుక మోడీ, అమిత్ షా కు ఏదన్నా వ్యూహం దాగుందేమో తెలీదు. రిజల్టు ఎలాగుంటుందో చూడాల్సిందే.

This post was last modified on April 25, 2023 7:54 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ప‌ల్నాడులో ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాలు హాట్ హాట్‌!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వ‌ర‌కు కూడా.. అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా రు. అధికారుల‌ను మార్చేశారు.…

2 hours ago

కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల బారులు…. సంకేతం ఏంటి?

రాష్ట్రంలో కీల‌క నాయ‌కులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్య‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఉద‌యం 6 గంట‌ల నుంచే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని…

2 hours ago

చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌… ఎవ‌రిని ఉద్దేశించి?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన త‌ర్వాత‌.. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..…

2 hours ago

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

2 hours ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

3 hours ago

ప‌వ‌న్ ఫ‌స్ట్ టైమ్‌.. స‌తీస‌మేతంగా ఓటేశారు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. గ‌తానికి భిన్నంగా ఆయ‌న ఈ సారి భార్య‌తో…

3 hours ago