మరోసారి అధికారం దక్కించుకుని.. కర్ణాటకలో ప్రభావం చూపించాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రోజు రోజుకు సెగలు పెరుగు తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడిపోయారు. దీనికి కారణం.. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఇప్పటి వరకు 212 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. వీరిలో సిట్టింగులకు చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు. కొందరికి పార్టీ అధిష్టానం నచ్చజెప్పగా మరికొందరికి మాత్రం ఊరడింపు లభించలేదు. దీంతో వారంతా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఇది పార్టీకి ప్రమాద సంకేతాలు ఇస్తున్నట్టేనని పరిశీలకులు చెబుతున్నారు. దీని నుంచి ఎలా బయట పడాలనే విషయంపై బీజేపీ పెద్దలు ఆలోచనలు చేస్తున్న సమయంలో మరో ఎదురు దెబ్బతగిలింది. బీజేపీ కీలకనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరుగు బావుటా ఎగుర వేసేందుకు రెడీ అయ్యారు. తనకు టికెట్ ఇచ్చే విషయంపై బీజేపీ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్కు హెచ్చరికలు చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను పార్టీ కోల్పోవాల్సి వస్తుందని సంచలన ప్రకటన చేశారు.
మాజీ సీఎం శెట్టర్ హుబ్బళి-ధార్వాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే.. ఈ టికెట్పై పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంటే.. ఇంకా ప్రకటించాల్సిన 12 స్థానాల్లో ఇది కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ కేటాయింపు అంశంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన శెట్టర్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో శెట్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నాకు టికెట్ కేటాయింపుపై పార్టీ నిర్ణయం కోసం ఈ నెల 16 వరకు ఎదురుచూస్తా. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. సీనియర్లకు టికెట్లు నిరాకరించడంపై బీజేపీ పునరాలోచించుకోవాలి. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నాకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలోని చాలా నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని మాజీ సీఎం యడియూరప్ప కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. నాకు టికెట్ ఇవ్వకపోతే.. 20 నుంచి 25 సీట్లు కోల్పోయే అవకాశముంది. రాష్ట్రమంతటా కూడా ఆ ప్రభావం ఉంటుంది’’ అని శెట్టర్ హెచ్చరించడం గమనార్హం. మరి ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on April 16, 2023 7:15 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…