Political News

నాకు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. పార్టీని ఓడిస్తా

మ‌రోసారి అధికారం ద‌క్కించుకుని.. క‌ర్ణాట‌క‌లో ప్ర‌భావం చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి రోజు రోజుకు సెగ‌లు పెరుగు తున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పార్టీని వీడిపోయారు. దీనికి కార‌ణం.. మొత్తం 224 స్థానాలున్న క‌ర్ణాట‌క అసెంబ్లీలో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు 212 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. అయితే.. వీరిలో సిట్టింగుల‌కు చాలా మందికి టికెట్లు ఇవ్వ‌లేదు. కొంద‌రికి పార్టీ అధిష్టానం న‌చ్చ‌జెప్ప‌గా మ‌రికొంద‌రికి మాత్రం ఊర‌డింపు ల‌భించ‌లేదు. దీంతో వారంతా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఇది పార్టీకి ప్ర‌మాద సంకేతాలు ఇస్తున్న‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీని నుంచి ఎలా బ‌య‌ట ప‌డాల‌నే విష‌యంపై బీజేపీ పెద్ద‌లు ఆలోచ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో మ‌రో ఎదురు దెబ్బ‌తగిలింది. బీజేపీ కీల‌క‌నాయ‌కుడు, మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్ తిరుగు బావుటా ఎగుర వేసేందుకు రెడీ అయ్యారు. త‌న‌కు టికెట్ ఇచ్చే విష‌యంపై బీజేపీ అధిష్టానం ఇంకా నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ హైకమాండ్‌కు హెచ్చరికలు చేశారు. తనకు టికెట్‌ ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పార్టీ కనీసం 20-25 సీట్లను పార్టీ కోల్పోవాల్సి వస్తుందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

మాజీ సీఎం శెట్టర్‌ హుబ్బళి-ధార్వాడ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే.. ఈ టికెట్‌పై పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అంటే.. ఇంకా ప్ర‌క‌టించాల్సిన 12 స్థానాల్లో ఇది కూడా ఉంది. ఈ నేపథ్యంలో తనకు టికెట్‌ కేటాయింపు అంశంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన శెట్టర్‌ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అయినప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో శెట్ట‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

‘‘నాకు టికెట్‌ కేటాయింపుపై పార్టీ నిర్ణయం కోసం ఈ నెల‌ 16 వరకు ఎదురుచూస్తా. ఆ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటా. సీనియర్లకు టికెట్లు నిరాకరించడంపై బీజేపీ పునరాలోచించుకోవాలి. ఇది వచ్చే ఎన్నికల్లో బీజేపీ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. నాకు టికెట్‌ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలోని చాలా నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని మాజీ సీఎం యడియూరప్ప కూడా హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. నాకు టికెట్‌ ఇవ్వకపోతే.. 20 నుంచి 25 సీట్లు కోల్పోయే అవకాశముంది. రాష్ట్రమంతటా కూడా ఆ ప్రభావం ఉంటుంది’’ అని శెట్ట‌ర్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ నేప‌థ్యంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Satya

Recent Posts

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

21 minutes ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

2 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

6 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

8 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

10 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

11 hours ago