Political News

ప‌వ‌న్ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వ‌రుస‌గా రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉంది. అదే సమ‌యంలో కేంద్రలోని కీల‌క నేత‌లు, కేంద్ర మంత్రుల‌తో ఆయ‌న‌ వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌‌తో, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌తో సమావేశమైన ఆయన.. మంగ‌ళ‌వారం మరికొంద‌రితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి.

పవన్‌ కల్యాణ్‌.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ నుంచి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో, కేంద్ర మంత్రులతో భేటీలు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి, భవిష్యత్‌ కార్యాచరణతోపాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి. అదే విధంగా.. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి, నిధులు.. స‌మ‌స్య‌లు.. పున‌రావాస ప్యాకేజీ వంటి అంశాల‌పైనా.. ప‌వ‌న్ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు.. పవన్‌ కల్యాణ్‌ను కలిసి వరుస భేటీల గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత భేటీల్లో చర్చిస్తోన్న అంశాలతోపాటు అన్ని విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు.

వ్యూహం ఇదేనా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న వెనుక అస‌లు వ్యూహం.. పొత్తులేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఒన‌గూరే ప్ర‌యోజ‌నాలు.. అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం వంటివాటిని వివ‌రించి.. టీడీపీకి దూరంగా ఉన్న బీజేపీని ఆయ‌న ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. అంతేకాదు.. మూడు పార్టీలు క‌లిస్తే.. ఏపీలో అధికారం చేప‌ట్ట‌డం పెద్ద క‌ష్టం కాద‌ని కూడా ప‌వ‌న్ తేల్చి చెప్ప‌నున్న‌ట్టు ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఆది నుంచి కూడా వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంను చీల‌కుండా చూస్తాన‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. ఇది జ‌ర‌గాలంటే.. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన మూడు పార్టీలు క‌లిసిపోటీ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌వ‌న్ లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలోనే రోడ్ మ్యాప్ కోసం ప‌వ‌న్ ప్ర‌య‌త్నించారు.కానీ, బీజేపీ మౌనం వ‌హించింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యమే ఉన్న క్ర‌మంలో తాజాగా బీజేపీని ఒప్పించి.. పొత్తుల దిశ‌గా అడుగులు వేయించే బాధ్య‌త‌ను ప‌వ‌న్ తీసుకున్నాడ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 4, 2023 4:27 pm

Share

Recent Posts

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

19 minutes ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

53 minutes ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

1 hour ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

1 hour ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

1 hour ago

బాలయ్య 111… రెండక్షరాల టైటిల్స్ రెడీ ?

నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…

2 hours ago