కేవీపీ రామచంద్రరావు పేరెత్తగానే అందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తారు. అందరూ వైఎస్ ఆత్మగా కేవీపీని చెబుతారు. వైఎస్ లాగే ఆయన కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు కూడా పడేది కాదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం చవిచూసినప్పటికీ కేవీపీ ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.
అలాంటి నేత.. తాజాగా చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. చంద్రబాబుకు తెలుగుదేశం నేతల తరహాలో ఆయన ఎలివేషన్ ఇవ్వడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో ఆయన విజయవాడలో తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు. మీరు ముందు ఉంటే మేం వెనుక నడుస్తాం అని చంద్రబాబును ఉద్దేశించి కేవీపీ వ్యాఖ్యానించడం విశేషం.
రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు పడటంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు లాంటి నేతల మీద ఉందని కేవీపీ అన్నారు. “మీ శక్తి సామర్థ్యాలు తక్కువేం కాదు. ఎంతో రాజకీయ చతురత ఉంది. దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువు కాగల శక్తి ఉంది. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా పని చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పోరాటంలో మీరు ముందు ఉండండి. మేం మీ వెనుక ఉంటాం.
చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసినపుడు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వచ్చి ఆయనకు మద్దతు తెలిపారు. ఇప్పుడు రాహుల్ మీద అనర్హత వేటు పడటంపై చంద్రబాబు స్పందించాలి” అని కేవీపీ అన్నారు. ఏపీలో 25 మంది ఎంపీలు, 175 ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా రాహుల్కు జరిగిన అన్యాయం మీద స్పందించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతో పవన్ ప్రశ్నించలేకపోయినా.. తప్పును తప్పు అని చెప్పాలని ఆయనన్నారు. వైఎస్ లాగా జగన్కు మీరెందుకు సలహాలివ్వలేదని అడిగితే.. మరో సందర్భంలో అందుకు కారణాలు చెబుతానని కేవీపీ చెప్పారు.
This post was last modified on April 2, 2023 5:27 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…