నేచురల్ స్టార్ నాని కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాగా ‘దసరా’ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, ఓపెనింగ్స్.. ఇలా ప్రతి విషయంలోనూ నానిని చాలా మెట్లు ఎక్కించేసింది. ఇంతకాలం మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా ఉన్న నాని.. ‘దసరా’తో టాప్ లీగ్ హీరోలకు దగ్గరగా వెళ్లిపోయాడు. రూ.60 కోట్ల బడ్జెట్, రూ.80 కోట్ల బిజినెస్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా మయామూలుగా లేవు.
తొలి రోజు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం చూసి ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హిందీలో, తమిళంలో ఈ వారం పెద్ద హీరోల సినిమాలు రిలీజైనా.. వాటిని వెనక్కి నెట్టి ఇండియన్ బాక్సాఫీస్లో నంబర్ వన్ సినిమాగా కొనసాగుతోంది ‘దసరా’. తెలుగు రాష్ట్రాల్లోనే కాక రిలీజైన ప్రతి చోటా ‘దసరా’ అదరగొడుతోంది. యుఎస్లో ‘దసరా’ రాంపేజ్ మామూలుగా లేదు.
ప్రిమియర్లతోనే 6 లక్షల డాలర్లు కొల్లగొట్టి శనివారానికే మిలియన్ మార్కును టచ్ చేసేసింది దసరా.
కొన్ని నెలల ముందు పరిస్థితి చూస్తే నాని స్థాయి హీరోకు వంద కోట్ల వసూళ్లు అన్నది ఊహకైనా అందని విషయమే. కానీ ఇప్పుడు ‘దసరా’తో ఆ మైల్ స్టోన్ను అందుకోబోతున్నాడు నాని. శనివారానికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.70 కోట్ల మైలురాయిని దాటేసింది. ఆదివారం అన్ని షోలు పూర్తయ్యేసరికి గ్రాస్ కలెక్షన్లు రూ.85 కోట్లకు చేరువ అవుతాయని భావిస్తున్నారు.
ఇంకా కొన్ని రోజులు సినిమా బాగానే ఆడే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఇక యుఎస్లో ఇప్పటికే నాని కెరీర్లో 8వ మిలియన్ డాలర్ల సినిమాగా ‘దసరా’ నిలిచింది. అది ముందు నుంచి లాంఛనం అనుకున్న విషయమే. ఇప్పుడీ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకోవడం కూడా పక్కాగా కనిపిస్తోంది. ఆదివారం షోలన్నీ అయ్యేసరికి 1.75 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో 2 మిలియన్ మార్కును కచ్చితంగా అందుకోవచ్చు.
This post was last modified on April 2, 2023 4:28 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…