నేచురల్ స్టార్ నాని కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమాగా ‘దసరా’ను చెప్పుకోవచ్చు. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, ఓపెనింగ్స్.. ఇలా ప్రతి విషయంలోనూ నానిని చాలా మెట్లు ఎక్కించేసింది. ఇంతకాలం మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడిగా ఉన్న నాని.. ‘దసరా’తో టాప్ లీగ్ హీరోలకు దగ్గరగా వెళ్లిపోయాడు. రూ.60 కోట్ల బడ్జెట్, రూ.80 కోట్ల బిజినెస్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా మయామూలుగా లేవు.
తొలి రోజు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం చూసి ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హిందీలో, తమిళంలో ఈ వారం పెద్ద హీరోల సినిమాలు రిలీజైనా.. వాటిని వెనక్కి నెట్టి ఇండియన్ బాక్సాఫీస్లో నంబర్ వన్ సినిమాగా కొనసాగుతోంది ‘దసరా’. తెలుగు రాష్ట్రాల్లోనే కాక రిలీజైన ప్రతి చోటా ‘దసరా’ అదరగొడుతోంది. యుఎస్లో ‘దసరా’ రాంపేజ్ మామూలుగా లేదు.
ప్రిమియర్లతోనే 6 లక్షల డాలర్లు కొల్లగొట్టి శనివారానికే మిలియన్ మార్కును టచ్ చేసేసింది దసరా.
కొన్ని నెలల ముందు పరిస్థితి చూస్తే నాని స్థాయి హీరోకు వంద కోట్ల వసూళ్లు అన్నది ఊహకైనా అందని విషయమే. కానీ ఇప్పుడు ‘దసరా’తో ఆ మైల్ స్టోన్ను అందుకోబోతున్నాడు నాని. శనివారానికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.70 కోట్ల మైలురాయిని దాటేసింది. ఆదివారం అన్ని షోలు పూర్తయ్యేసరికి గ్రాస్ కలెక్షన్లు రూ.85 కోట్లకు చేరువ అవుతాయని భావిస్తున్నారు.
ఇంకా కొన్ని రోజులు సినిమా బాగానే ఆడే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ రన్లో రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు. ఇక యుఎస్లో ఇప్పటికే నాని కెరీర్లో 8వ మిలియన్ డాలర్ల సినిమాగా ‘దసరా’ నిలిచింది. అది ముందు నుంచి లాంఛనం అనుకున్న విషయమే. ఇప్పుడీ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకోవడం కూడా పక్కాగా కనిపిస్తోంది. ఆదివారం షోలన్నీ అయ్యేసరికి 1.75 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్లో 2 మిలియన్ మార్కును కచ్చితంగా అందుకోవచ్చు.
This post was last modified on April 2, 2023 4:28 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…